Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాని, నితిన్ను హీరో చేసి.. విలన్గా మారిన టాలీవుడ్ నిర్మాత!
టాలీవుడ్లో నిర్మాత డీఎస్ రావు విలన్గా మారారు. హీరో నితిన్తో ద్రోణ, నానితో పిల్ల జమీందార్, నిఖిల్తో కళావర్ కింగ్, మంచు మనోజ్తో మిస్టర్ నూకయ్య లాంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు నటుడిగానూ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం "రంగు, నయనం, విశ్వామిత్ర, ప్రేమకథాచిత్రం-2, కల్కి, యుద్ధం చెయ్" లాంటిటి చిత్రాలో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. నటుడిగా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారు. ఈ సందర్భంగా నటుడిగా బిజీగా మారడంపై డీఎస్ రావు స్పందించారు.
నవంబర్ 10, తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతగా ఇప్పటికి 20 సినిమాలు తీశాను. ప్రముఖ దర్శకుడు తేజ ప్రోత్సాహంతో నటుడిగా మారాను. ప్రముఖ దర్శకుడు తేజ తొలిసారి డి.ఎస్.రావులోని నటుడిని గుర్తించి, 'హోరాహోరీ'లో విలన్ గా అవకాశమిచ్చారు అని తెలిపారు.
తదుపరి నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన "కళ్యాణవైభోగం"లోనూ ముఖ్య పాత్ర పోషించాను. ఇప్పటికి 15 సినిమాలు చేశాను. తెలుగుతోపాటు కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాను. నటుడిగా రాణిస్తూనే.. మంచి ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు ప్రొడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా విలన్ గా మంచి గుర్తింపు సాధించాలని కోరుకుంటున్నాను అని డీఎస్ రావు అన్నారు.