Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
'సంతోషం' నిర్మాత కె.ఎల్.నారాయణపై కిడ్నాప్, కబ్జా కేసులు
వివరాల్లోకి వస్తే...ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ, ఆయన స్నేహితులు, రియల్టర్లు చంద్రారెడ్డి, కృష్ణలపై కేసులు నమోదు చేశారు. బలవంతపు వసూలు, భూకబ్జా, అనుమతి లేకుండా ప్రవేశం, కిడ్నాప్లో ప్రమేయం ఉన్న అభియోగంపై నిర్మాత నారాయణ, మరో ఇద్దరు చంద్రారెడ్డి, కృష్ణలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ ఎసిపి ఇ.శంకర్ రెడ్డి మీడియాతో అన్నారు.
కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్, రోడ్ నెంబర్ ఐదులో తన భూమిలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన నిర్మాత నారాయణ, బిల్టర్లు కృష్ణ, చంద్రారెడ్డి కాపలాదారుని బెదిరించారని పేర్కొంటూ సయీద్ నయీముద్దీన్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. భూమి విక్రయించాలని వారు పట్టుబట్టారని, విలువైన భూమి కబ్జాలో వారి ప్రమేయముందని ఆరోపించారు.
కేసును బంజారా హిల్స్ పోలీసులకు సూచించిన కోర్టు.. నిర్మాత నారాయణ, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసి, నివేదిక సమర్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. నారాయణ గతంలో 'క్షణక్షణం', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'సంతోషం' తదితర సూపర్ హిట్ చిత్రాలను నారాయణ నిర్మించారు.
ఇక జాస్తి దర్శకత్వంలో మహేష్ గతంలోనే (2007 డిసెంబరులో) 'మిర్చి' అనే టైటిల్ తో ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు. మిర్చిని దుర్గా ఆర్ట్స్ బానర్ పై కెఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాలని సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ను, ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్ ను ఎంచుకున్నారు. హైదరాబాద్ శివార్లలో ఒక భారీ సెట్ను నిర్మించడానికి అశోక్ పనులు కూడా మొదలుపెట్టాడు.అయితే అప్పుడు స్క్రిప్టు సంతృప్తిగా రాకపోవటంతో ఆగిపోయింది.