Don't Miss!
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
మంచు మోహన్ బాబు ఇంట విషాదం
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు.
ఈ సాయంత్రం 4 గంటలకు
మంగళవారం సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మోహన్ బాబు నటించిన పలు సినిమాలకు వెంకటాద్రినాయుడు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు.
సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు
వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటాద్రినాయుడు మృతి విషయం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నారావారి పల్లెలో తుది వీడ్కోలు
మోహన్ బాబు కుటుంబసబ్యులు సహా పలువురు సినీ ప్రముఖులూ, రాజకీయ నేతలూ నారా వారి పల్లెలో ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు. ఆ మధ్య వరుసగా సినీ పరిశ్రమకి చెందిన నటులూ, దర్శకుల మరణాలు తెలుగు ఇండస్ట్రీని కొంత కలవర పెట్టాయి.
కొన్నేళ్ళుగా సినిమాలకి దూరం
కొంత
కాలంగా
ప్రశాంతంగా
ఉన్న
టాలీవుడ్
మేడసాని
మృతి
తో
మళ్ళీ
విషాదం
లో
మునిగి
పోయింది.
గత
కొన్నేళ్ళుగా
సినిమాలకి
దూరంగానే
ఉన్న
ఆయన
శ్రీవిద్యానికేతన్
విద్యాసంస్థల
కోశాధికారిగా
కూడా
వ్యవహరించి
ప్రస్తుతం
స్వగ్రామం
లోనే
విశ్రాంతిగా
గడుపుతున్నారు.
బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా
తెలుగు ఇండస్ట్రీలో 1980,90 దశకాల్లో వచ్చిన సినిమాలకు వేంకటాద్రి నాయుడు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. వాటిలో మోహన్ బాబు సినిమాలు కూడా ఉన్నాయి. సొంత బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా చెప్పుకునే వేంకటాద్రి నాయుడు మరణం మంచు మోహన్ బాబు కి మరింత ఎక్కువ భాదనే కలిగించిందట.