Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్లాఫ్ సినిమాకి...సీక్వెల్ తీస్తానంటారేంటి గురూ
చెన్నై : సాధారణంగా సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తూంటాయి. కానీ ఫ్లాఫ్ సినిమాలకు కూడా సీక్వెల్ తీస్తాననటం ఆశ్చర్యే అంటున్నారు. ఇంతకీ ఆ ప్లాఫ్ సీరియల్ మరేదో కాదు...రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ తెరకెక్కించిన సినిమా 'కోచ్చడయాన్'(విక్రమ్ సింహా). త్రీడీ మోషన్ కేప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన చిత్రమిది. ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పించింది. మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ రూపొందించింది. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు నిర్మాత మాత్రం సీక్వెల్ తీస్తానంటున్నాడు.
సహ నిర్మాత మురళీ మనోహరన్ మాట్లాడుతూ "మాకున్న బడ్జెట్ని, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మేం అద్భుతాలను చేశాం. ఈ విషయాన్ని పలువురు ప్రతిభావంతులు సైతం ఒప్పుకున్నారు. 'కోచ్చడయాన్'కన్నా సీక్వెల్ను ఇంకా బాగా చేస్తాం. ఎక్కువ కష్టపడతాం'' అని అన్నారు.
అలాగే సినిమా వర్కవుట్ కాలేదా అని మీడియావారు అడిగితే... "త్రీడీ మోషన్ కేప్చర్ విధానంలో రజినీకాంత్ను చూడటం దక్షిణాది వారికి థ్రిల్గా అనిపించింది.ఉత్తరాది ప్రేక్షకులు అంతగా రిజీవ్ చేసుకోలేకపోయారు. ఆ విషయం కాస్త నిరాశపరచింది'' అని తెలిపారు.