Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఆరెంజ్', 'ఖలేజా', 'పులి' వల్లే నాశనమంటూ హెచ్చరిక
'ఆరెంజ్', 'ఖలేజా', 'పులి' వల్ల ఎంతమంది నాశనమైపోయారో గుర్తించాలంటూ నట్టికుమార్ ఆవేశంగా ప్రశ్నించారు.సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలు పెంచే యోచన చేయొద్దని నిర్మాతల మండలి హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ ఇలా స్పందించారు.
ప్రస్తుతమున్న టిక్కెట్ ధరలే సామాన్యులకి భారమై చిన్న సినిమాలకు కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయనీ, ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులపై మరింత భారం మోపితే చిన్న సినిమా నాశనమై పోతుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెంచితే సహించమనీ, ఆందోళనలు చేపడతామనీ హెచ్చరించారు. అలాగే టిక్కెట్ రేట్లు పెంచితే తామంతా సినిమాలు తియ్యడం మానేస్తామని హెచ్చరించారు. నిర్మాతలందరి అభిప్రాయాలూ తెలుసుకుని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పదేళ్లలో వెయ్యి థియేటర్లు మూతపడ్డాయనీ, ఓవైపు జనాభా పెరుగుతుంటే థియేటర్లు తగ్గుతున్నాయనీ అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు టిక్కెట్ రేట్లు పెంచడం సరికాదనీ తెలిపారు.ప్రస్తుతం నట్టికుమార్ ..చట్టం..నీ అబ్బ సొత్తా, మహంకాళి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన భైరవ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.