Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'ఆరెంజ్', 'ఖలేజా', 'పులి' వల్లే నాశనమంటూ హెచ్చరిక
'ఆరెంజ్', 'ఖలేజా', 'పులి' వల్ల ఎంతమంది నాశనమైపోయారో గుర్తించాలంటూ నట్టికుమార్ ఆవేశంగా ప్రశ్నించారు.సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలు పెంచే యోచన చేయొద్దని నిర్మాతల మండలి హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ ఇలా స్పందించారు.
ప్రస్తుతమున్న టిక్కెట్ ధరలే సామాన్యులకి భారమై చిన్న సినిమాలకు కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయనీ, ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులపై మరింత భారం మోపితే చిన్న సినిమా నాశనమై పోతుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెంచితే సహించమనీ, ఆందోళనలు చేపడతామనీ హెచ్చరించారు. అలాగే టిక్కెట్ రేట్లు పెంచితే తామంతా సినిమాలు తియ్యడం మానేస్తామని హెచ్చరించారు. నిర్మాతలందరి అభిప్రాయాలూ తెలుసుకుని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పదేళ్లలో వెయ్యి థియేటర్లు మూతపడ్డాయనీ, ఓవైపు జనాభా పెరుగుతుంటే థియేటర్లు తగ్గుతున్నాయనీ అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు టిక్కెట్ రేట్లు పెంచడం సరికాదనీ తెలిపారు.ప్రస్తుతం నట్టికుమార్ ..చట్టం..నీ అబ్బ సొత్తా, మహంకాళి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన భైరవ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.