Don't Miss!
- News ఏపీకి మరో వరం ప్రకటించిన మోడీ
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
'ఆరెంజ్', 'ఖలేజా', 'పులి' వల్లే నాశనమంటూ హెచ్చరిక
'ఆరెంజ్', 'ఖలేజా', 'పులి' వల్ల ఎంతమంది నాశనమైపోయారో గుర్తించాలంటూ నట్టికుమార్ ఆవేశంగా ప్రశ్నించారు.సినిమా హాళ్లలో టిక్కెట్ ధరలు పెంచే యోచన చేయొద్దని నిర్మాతల మండలి హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ ఇలా స్పందించారు.
ప్రస్తుతమున్న టిక్కెట్ ధరలే సామాన్యులకి భారమై చిన్న సినిమాలకు కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయనీ, ఇలాంటి పరిస్థితిలో ప్రేక్షకులపై మరింత భారం మోపితే చిన్న సినిమా నాశనమై పోతుందనీ ఆందోళన వ్యక్తం చేశారు. ధరలు పెంచితే సహించమనీ, ఆందోళనలు చేపడతామనీ హెచ్చరించారు. అలాగే టిక్కెట్ రేట్లు పెంచితే తామంతా సినిమాలు తియ్యడం మానేస్తామని హెచ్చరించారు. నిర్మాతలందరి అభిప్రాయాలూ తెలుసుకుని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పదేళ్లలో వెయ్యి థియేటర్లు మూతపడ్డాయనీ, ఓవైపు జనాభా పెరుగుతుంటే థియేటర్లు తగ్గుతున్నాయనీ అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు టిక్కెట్ రేట్లు పెంచడం సరికాదనీ తెలిపారు.ప్రస్తుతం నట్టికుమార్ ..చట్టం..నీ అబ్బ సొత్తా, మహంకాళి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన భైరవ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.