Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆమరణదీక్ష: ఆ ఐదుగురి వల్లే టాలీవుడ్ నష్టపోతోంది!
హైదరాబాద్: థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బుధవారంతో ఆయన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల లీజు విధానం వల్ల ఇతర నిర్మాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు.
పరిశ్రమలోని ఐదుగురు పెద్ద నిర్మాతలు లీజు పేరుతో థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, థియేటర్లకు, నిర్మాతలకు మధ్య దళారుల్లా వ్యవహరిస్తున్నారని...వారి వల్ల చిన్న నిర్మాతలు సినిమాలు విడుదల చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వీరు ప్రభుత్వానికి 30 శాతం పన్ను కూడా కట్టం లేదన్నారు. వెంటనే థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలని, అప్పటి వరకు నా ప్రాణం పోయినా దీక్ష విరమించేది లేదన్నారు.
లీజు విధానం రద్దు చేయడంతో పాటు ఫిలించాంబర్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఆర్కే గౌడ్ డిమాండ్ చేశారు. ఆర్కే గౌడ్కు పలువురు నిర్మాతలు మద్దతు ప్రకటించారు.