Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
200కోట్లతో రామోజీరావు మరో వ్యాపారం.. త్వరలో ఈటీవీ ఓటీటీ!
ఓటీటీ కంపెనీలు కేవలం ఒక ఏడాదిలో వారి మార్కెట్ స్థాయిని అమాంతంగా పెంచేసుకున్నాయి. జియో వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ అనేది అందరికి అలవాటుగా మారిపోయింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర స్థాయి ఓటీటీ సంస్థలు కూడా లోకల్ కంటెంట్ తో ప్రతి లాంగ్వేజ్ ప్రేక్షకులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కూడా ఓటీటీ కంపెనీలకు బాగా హెల్ప్ అయ్యింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆహా యాప్ డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. వేరే భాషలను టచ్ చేయకుండా కేవలం తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఆహా యాప్ ను గట్టిగానే ప్రమోట్ చేశారు. డైరెక్ట్ గా కొన్ని మంచి కంటెంట్ సినిమాలను కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈటీవీ కూడా ప్రత్యేకమైన ఓటీటీ కంటెంట్ తో రాబోతున్నట్లు సమాచారాన్ని. దాదాపు ఓల్డ్ మూవీస్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ చాలా వరకు ఈటీవీ దక్కించుకుంది.
ఇక ఎన్నో క్లాసిక్ సినిమాలను ఉషా కిరణ్ మూవీస్ లో నిర్మించారు. అన్ని సినిమాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఓటీటీ యాప్ లో మిక్స్ చేయనున్నట్లు సమాచారం. అలాగే 200కోట్ల భారీ బడ్జెట్ కొత్త తరహా ఓటీటీ సినిమాలను ప్రోగ్రాంలను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మాత రామోజీరావు ఓటీటీ పై పట్టు సాధించేందుకు.ప్లా న్ వేసినట్లు సమాచారం. మరి ఆయన అనుకున్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.