Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
200కోట్లతో రామోజీరావు మరో వ్యాపారం.. త్వరలో ఈటీవీ ఓటీటీ!
ఓటీటీ కంపెనీలు కేవలం ఒక ఏడాదిలో వారి మార్కెట్ స్థాయిని అమాంతంగా పెంచేసుకున్నాయి. జియో వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ అనేది అందరికి అలవాటుగా మారిపోయింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర స్థాయి ఓటీటీ సంస్థలు కూడా లోకల్ కంటెంట్ తో ప్రతి లాంగ్వేజ్ ప్రేక్షకులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ కూడా ఓటీటీ కంపెనీలకు బాగా హెల్ప్ అయ్యింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆహా యాప్ డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. వేరే భాషలను టచ్ చేయకుండా కేవలం తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఆహా యాప్ ను గట్టిగానే ప్రమోట్ చేశారు. డైరెక్ట్ గా కొన్ని మంచి కంటెంట్ సినిమాలను కూడా రిలీజ్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈటీవీ కూడా ప్రత్యేకమైన ఓటీటీ కంటెంట్ తో రాబోతున్నట్లు సమాచారాన్ని. దాదాపు ఓల్డ్ మూవీస్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ చాలా వరకు ఈటీవీ దక్కించుకుంది.
ఇక ఎన్నో క్లాసిక్ సినిమాలను ఉషా కిరణ్ మూవీస్ లో నిర్మించారు. అన్ని సినిమాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఓటీటీ యాప్ లో మిక్స్ చేయనున్నట్లు సమాచారం. అలాగే 200కోట్ల భారీ బడ్జెట్ కొత్త తరహా ఓటీటీ సినిమాలను ప్రోగ్రాంలను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మాత రామోజీరావు ఓటీటీ పై పట్టు సాధించేందుకు.ప్లా న్ వేసినట్లు సమాచారం. మరి ఆయన అనుకున్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.