Don't Miss!
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
నా పెళ్లికి కారణం ఎన్టీఆర్.. మేకప్ కూడా తీయకుండా వచ్చి.. నిర్మాత స్వప్న దత్ ఆసక్తికర కామెంట్స్
సెన్సేషనల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ నటించిన అద్ధుతమైన ప్రేమ కావ్యం సీతా రామం. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరో కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న విడుదలైంది. తొలి రోజు నుంచే విజయపథంలో దూసుకుపోతున్న ఈ మూవీ వైజయంతీ మూవీస్ సమర్పణలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఆయనకు నందమూరి కుటుంబానికి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అయితే అశ్వనీ దత్ రెండో కుమార్తె, ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్గా రాణిస్తున్న స్వప్న దత్ పెళ్లి విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడని టాక్. మరి అదెంటో చూద్దామా!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో అశ్వినీ దత్ ఒకరు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీతో..
ఇందులో బిగ్బీ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్ర నిర్మాత అయిన అశ్వనీదత్కు నందమూరి కుటుంబానిక చక్కని అనుబంధం ఉందని చెప్పుకుంటారు.
బ్యానర్లో ఎన్టీఆర్ ఫొటో..
అశ్వనీ దత్ వైజయంతీ మూవీస్ బ్యానర్లో సీనియర్ ఎన్టీఆర్ ఫొటో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్తో సైతం స్టూడెంట్ నెంబర్ 1, కంత్రి, శక్తి వంటి చిత్రాలను నిర్మించారు అశ్వనీ దత్.
చాలా క్లోజ్..
సినిమాల సంగతి పక్కన పెడితే రియల్ లైఫ్లో అశ్వనీ దత్ కుటుంబానికి తారక్ చాలా సాన్నిహిత్యంగా ఉంటాడట. అయితే అశ్వనీ దత్ రెండో కుమార్తె స్వప్న దత్ పెళ్లికి ఎన్టీఆర్ సహాయం చేశాడట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా స్పప్న దత్ తెలిపింది.
గ్యాప్ తీసుకుందామనుకున్నా..
'మీ పెళ్లి జరగడంలో ఎన్టీఆర్ పాత్ర ఉందట కదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ''అవును. నా ప్రేమ వర్కౌట్ అవదులే. కొంచెం గ్యాప్ తీసుకుందాం అని నేను అనుకుంటున్న సమయంలో తారక్ వచ్చి నాన్న గారితో మాట్లాడి ఒప్పించాడు.
మేకప్ తీయకుండా వచ్చి మరీ..
'ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయకూడదు నేను వచ్చి మాట్లాడతాను' అని సినిమా షూటింగ్ మధ్యలోనే మేకప్ కూడా తీయకుండా వచ్చి మా నాన్నతో మాట్లాడాడు. నా జీవితంలో ఎన్టీఆర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.
2010లో వివాహం..
తనను కానీ, తను సహాయాన్ని కానీ అస్సలు మర్చిపోలేను. మా బ్యానర్లో ఎన్టీఆర్ సినిమా చేసిన, చేయకున్నా నాతో క్లోజ్గా ఉంటాడు' అని తెలిపింది. కాగా ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని స్వప్న దత్ ప్రేమించి 2010 డిసెంబర్ 19న వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నవ్య జయంతి అనే కుమార్తె కూడా ఉంది.