నా టార్గెట్ అదే.. రాజా సాబ్ మూవీకి అన్నీ వందల కోట్లు అందుకే.. టీజీ విశ్వప్రసాద్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్. అతని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో
ఎంతో మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. సింపుల్ గా చెప్పాలంటే.. ఎంటర్టైన్ చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కొత్త సరుకు ను క్రియేట్ చేస్తారు. అసలు లాభనష్టాలను అసలు పట్టించుకోరు. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తెలుగు రైట్ తీసుకొని చాలా నష్టపోయాడతడు. అయినా ఏ మాత్రం కుంగిపోకుండా తాజాగా ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో మరోసారి ముందుకు వచ్చారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏదిఏమైనా తన టార్గెట్ రిచ్ అయ్యే వెనకడుగు వేయననీ టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. ఇంతకీ ఈ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ గోల్ ఏంటీ? ఆయన టార్గెట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
తాను అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాననీ, ఒక్కటి, రెండు మూవీస్ చేయద్దామనే ఆలోచన ఉండేది. కానీ, ఎంటర్టైన్ మెంట్ లో మూవీస్ వన్ ఆఫ్ ది బెస్ట్. అందుకనే ఎకొ వర్డల్ గా బిల్ట్ చేయాలనే మూవీ మేకింగ్ ప్రారంభించానని అన్నారు. తాను హిట్, ఫ్లాప్స్ పట్టించుకోనని, ఇదో బిజిసెన్ అంటూ క్లియర్ గా చెప్పేశారు.
తనకు నచ్చిన స్టోరీ కంటే.. జనాలు అదరించే స్టోరీలను తీయాలని.. అలా అయితేనే హిట్లు వస్తాయని అన్నారు. తనకు పాన్ ఇండియా మూవీని తీయడం విషయం కాదనీ, వర్డల్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేసేలా.. గ్లోబల్ మూవీస్ తీయాలనేదే నా అల్టీమేట్ టార్గెట్. అందుకోసమే ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు ఇండ్రస్టీలో అన్నింటిని తనకు తగ్గట్లు మార్చుకుంటున్నారన్నారు. ఈ క్రమంలోనే పలు కమర్షల్ మూవీస్ చేస్తున్నననీ, అందులో కొన్ని హిట్లు కాగా.. మరికొన్ని ప్లాప్స్ గా నిలిచాయన్నారు.

గూఢచారి, కార్తీకేయ, ఓ బేబీ అనుకున్నట్టు భారీ హిట్ అందించాయనీ, కానీ, ఈ మధ్య స్వాగ్ మూవీ మాత్రం ఉహించని షాకిచ్చిందన్నారు. దానికి ముందు మరో సినిమా కూడా ఫ్లాపయింది. కానీ, రాజా సాబ్ మాత్రం ల్యాండ్ మార్క్ మూవీ కాబోతోందన్నారు. ఇప్పటి వరకూ తమకు వచ్చిన నష్టాలను అది కవర్ చేస్తదని చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ సినిమానే కాకుండా ఇతర సినిమాలతోనూ ఈ ప్రొడ్యూసర్ బాగానే నష్టాలు ఎదుర్కొన్నాడు.
అలాగే.. ఇండస్ట్రీలో సమస్యలు కూడా ఉన్నాయనీ, తనని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారనీ, తన వద్ద బ్లాక్ మనీ ఉందంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని వాటిని అసలు పట్టించుకోనని బహిరంగంగా ప్రకటించేశారు. అలాగే.. తనకు రియల్ ఎస్టేట్ బిజిసెస్ లేదనీ, ఇండియాలో గానీ, ఫారెన్ లో గానీ తన పేరుపై ఒక్క సెంట్ లాండ్ కూడా లేదని అన్నారు. ఇతర వ్యాపారాల్లో లాభాలను మాత్రమే ఇండస్ట్రీలో పెడుతున్నాననీ, అందుకే తాను హిట్.. ఫ్లాప్ లతో పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నానన్నారు.

అలాగే.. ప్రభాస్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. తమ నష్టాలను పూడ్చే సినిమా రాజా సాబే అని, అందుకే భారీ బడ్జెట్ తో మూవీ తీసున్నాననీ అన్నారు. ది రాజాసాబ్ మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకోవడానికి ఓ బలమైన కారణముందని టాక్. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడటమే కారణమంటున్నారు ఫ్యాన్స్ .


Click it and Unblock the Notifications











