Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కన్నుమూత
వడ్డే రమేష్ ఇప్పటి వరకు పలువురు ప్రముఖ హీరోలతో సినిమాలు తీసారు. ఎన్టీఆర్తో బొబ్బిలి పులి, కృష్ణం రాజుతో కటకటాల రుద్రయ్య లాంటి హిట్స్ ఇచ్చారు. చిరంజీవితో లంకేశ్వరుడు చిత్రాన్ని నిర్మించారు. కృష్ణా జిల్లా యలమర్రు గ్రామానికి చెందిన వడ్డే రమేష్ కుటుంబం బెజవాడలో సెలైంది. ఆయన తనయుడు వడ్డే నవీన్ కూడా పలు చిత్రాల్లో హీరోగా పని చేసారు.
వడ్డే రమేష్ తొలి సినిమా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'పాడవోయి భారతీయుడా'. ఈ చిత్రం ద్వారా శ్రీదేవి హీరోయిన్గా పరిచయం చేసారు. శ్రీదేవికి మొదట హీరోయిన్ చాన్స్ ఇచ్చింది వేరే అయినప్పటికీ తొలుత విడుదలైంది మాత్రం ఇదే. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద నష్టాలను మిగిల్చింది.
వీటితో పాటు పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ, విశ్వనాథ నాయకుడు, పండంటి కాపురం లాంటి చిత్రాలను నిర్మించారు. పండండి కాపురం చిత్రాన్ని హిందీలో 'సుర్ హరా సంసార్' పేరుతో అనువదించారు. అమ్మకొడుకు అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు వడ్డే రమేష్.