హైదరాబాద్: శేఖర్కమ్ముల శిష్యుడు ఎ.సాయికిరణ్ దర్శకత్వంలో సోనియా, కృష్ణుడు హీరో హీరోయిన్లుగా రూపొంది విడుదలైన 'వినాయకుడు' చిత్రంఊ రోజు(శనివారం) రిలీజయిన సంగతి తెలిసిందే. అయితే ఊ చిత్రం విచిత్రమైన వివాదంలో చిక్కుకుంది. ఓ సాధారణ ప్రేమకథా చిత్రానికి వినాయకుడి టైటిల్ పెట్టటం ఆయనను అవమానపరచటమేనని ఆరోపిస్తూ ఏబీవీపీ, భజరంగదళ్ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్లో ఆందోళనకు తిగారు. ఆ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల ముందు ధర్నాలు చేశారు. దిల్షుక్నగర్, తదితర ప్రాంతాల్లో రాళ్లు రువ్వి థియేటర్ అద్దాలు పగులగొట్టటంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.