Don't Miss!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చెప్పులతో కొట్టి.. భన్సాలీ దిష్టిబొమ్మ దగ్ధం.. ఢిలీకి పద్మావతి సెగ.. రెచ్చిపోయిన కార్యకర్తలు
Recommended Video
పద్మావతి చిత్ర వివాదం ఇప్పుడు దేశ రాజధానికి చేరుకొన్నది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు ఎగిసిపడుతున్నాయి. రాష్ట్రపతి చేత్న మంచ్ అనే హిందుత్వ సంస్థ ఢిల్లీలో భారీ ర్యాలీని నిర్వహించింది. ఇందులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా పాలుపంచుకోవడం మరింత వివాదంగా మారింది. రాజ్పుత్ కమ్యూనిటికి చెందిన కథతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వ్యతిరేకంగా పలు హిందుత్వ సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీలో భారీ ర్యాలీ
పద్మావతి చిత్రానికి, భన్సాలీకి వ్యతిరేకంగా పలు హిందూత్వ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి ప్రాంతంలో భారీ ర్యాలీని నిర్వహించారు. భన్సాలీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భన్సాలీ చిత్ర పటానికి చెప్పుల దండలు వేసి ఊరేగించారు.
చెప్పులతో కొట్టి.. దిష్టిబొమ్మను..
పద్మావతికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన తర్వాత ఆజాద్పూర్లోని ఓ కూడలిలో భన్సాలీ దిష్టిబొమ్మను మంటల్లో తగులబెట్టారు. దిష్టిబొమ్మ కాలుతుండగానే చెప్పులు విసిరి నిరసనను వ్యక్తం చేశారు. భన్సాలీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పద్మావతి జాతికి ప్రతీక
పద్మావతి ఓ కమ్యూనిటికి చెందిన వారు కాదు. ఆమె దేశానికి మొత్తం ఓ ప్రతీక. శత్రుదేశాల రాజు దండయాత్ర చేయడంతో ఆత్మార్పణం చేసుకొన్నారు. అలాంటి త్యాగమూర్తి రాణి పద్మినీ చరిత్రకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. దేశ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా రూపొందించిన పద్మావతి చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నాం అని బీజేపీ నేత రోషన్ కెన్సల్ అన్నారు.
సెన్సార్ బోర్డుపై మండిపాటు
ఢిల్లీలో పద్మావతి చిత్రాన్ని విడుదల చేయడానికి ఒప్పుకోం. సెన్సార్ బోర్డుకు చరిత్ర తెలియదు. ఇలాంటి వివాదాస్పద సినిమాలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందు రాజవంశాలకు చెందిన ప్రతినిధులు, చరిత్రకారులతో చర్చలు జరపాలి అని ఆందోళనకారులు అన్నారు.
పద్మావతి వివాదానికి రాజకీయ రంగు
పద్మావతి చిత్రంపై నిరసన మొదట్లో కొన్ని హిందూ సంస్థలకే పరిమితం కాగా, ఇప్పుడు ఆ చిత్రానికి రాజకీయ రంగు పులుముకొంటున్నదనే విమర్శ వినిపిస్తున్నది. నిరసన, ఆందోళనకారులకు బీజేపీ కార్యకర్తలు బాహాటంగా మద్దతు తెలుపడం మరింత వివాదంగా మారుతున్నది.