Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగాస్టార్ కి మొదటికే మోసం
పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో 'చిరు' సినిమాల వైపువెళితే మొదటికే మోసం వస్తుందని ప్రజారాజ్యం పార్టీ నేతలు చాలామంది భావిస్తున్నారంటూ కథనాలు వస్తున్నాయి.నాలుగు రోజుల క్రితం ఆ పార్టీ సీనియర్ నేత, చిరంజీవికి పెద్దదిక్కుగా వ్యవహరించిన హరి రామజోగయ్య కూడా 'చిరు' మళ్లీ నటిస్తే బాగుంటుంద ని మీడియాతో అని చర్చకు తెరలేపారు. అంతేగాక ఆ మేరకు చిరంజీవికి సందేశాత్మక చిత్రాలలో నటించి అభిమానులకు మళ్ళీ దగ్గరకమ్మని సలహా కూడా ఇచ్చానని చెప్ప డం చర్చనీయాంశమైంది.
దాంతో చిరంజీవి మళ్లీ వెండితెరపై కనిపిస్తే పార్టీకి కలిగే లాభనష్టాలను పార్టీ నేత లు బేరీజు వేస్తున్నారు. సీనియర్ నేతలు మాత్రం 'చిరు' రీ ఎంట్రీ అనవసరం అని భావిస్తున్నారు.మరికొంతమంది అయితే 'చిరు' సోదరుడు పవన్ కళ్యాణ్, కుమారుడు రాంచరణ్ తేజ ఇప్పటికే సినీ రంగంలో 'చిరు' ప్రతినిధులుగా ఉ న్నందున ప్రత్యేకంగా మళ్లీ చిరంజీవి సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏ ముందని గోదావరి జి ల్లాలకు చెందిన పార్టీ నేత ఒకరు ప్రశ్నించారు.అలాగే పార్టీకి ఉపయోగపడే విధంగా ఏదైనా సినిమా తీ యదలచుకుంటే మంచిదని, సందేశాత్మక చిత్రాలను ఎంచుకుని చిరంజీవి మళ్లీ నటిస్తే పార్టీకి మేలు చేకూరుతుందని చెబుతున్నారు.
పవన్, రాంచరణ్ ఉన్నప్పటికీ జనంలో చిరంజీవి ప్రభావం వేరని వారు అంటున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక నేత మాట్లాడుతూ... చిరంజీవి నటించడం ద్వారా ఎ న్నికల్లో కొంత దూరమైన అభిమానులను తిరిగి దరి చేర్చుకునే అవకాశం ఉంటుందని,సందేశాత్మక చిత్రాల ద్వారా పీఆర్పీ సిద్ధాంతా లు, విధానాలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అయితే పార్టీ కోసమే చిరంజీవి సినిమాల్లో నటించినప్పటికీ, ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేసే ప్రమాదం ఉన్నదన్నది మరికొందరి వాదన.ఇవన్నీ ఇలా ఉంటే చిరంజీవి మాత్రం తన రీఎంట్రీ పై మాత్రం స్పష్టమైన ప్రకటన మాత్రం చేయటం లేదు.