Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమ్మ చనిపోయినంత బాధ: 'ఖైదీ నెం.150' పై ఫేస్ బుక్ లో ఫృధ్వీ షాకింగ్ పోస్ట్
చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పై కమిడియన్ ఫృధ్వీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో తెలుగులో వరస సినిమాలతో ఏలుతున్న స్టార్ కమెడీయన్ పృధ్వీని తెగ బాధపెట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా పృద్వీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.
చిరు 150వ చిత్రంలో నటించే గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు. ఈ ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. దాదాపు ఈ కమెడీయన్ పై అన్ని సీన్లను తెరకెక్కించాక ఎడిటింగ్ టైంలో వాటిని తొలగించారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పందించిన పృధ్వీతన సీన్స్ ని ఎడిట్ చేసారని తెలుసుకుని షాక్ అయ్యాడు పృధ్వీ. ఈ విషయం గురించి తన ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు.
''చాలా బాధగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రంలో నటించడం నా అదృష్టం. సీన్స్ రిమూవ్ చేయడం నా దురదృష్టం. పండగ పూట మా అమ్మ చనిపోయినంత బాధగా ఉంది'' అని ట్వీట్ చేసాడు పృధ్వీ.
ఈ పోస్ట్ ని బట్టి పృధ్వీ ఎంత బాధపడిపోతున్నాడో మనకు అర్ధం అవుతోంది. పృధ్వీ చేసిన సీన్స్ చాలా బాగున్నాయని,. అందుకే పృధ్వీ ఇంత బాధపడిపోతున్నారని అంటున్నారు.
అయితే సినిమా లెంగ్త్ ఎక్కువై నప్పుడు సీన్స్ ఎడిట్ చేయడం సాధారణంగా జరిగే విషయమే. అలా ఎడిట్ చేసే వ్యవహారంలో .. మరీ ముఖ్యంగా కామెడీ సీన్స్ ని ఎడిట్ చేస్తుంటారు. కామెడీ సీన్స్ ఎడిట్ చేయడం వల్ల కథకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలా భావించే పృధ్వీ సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటారు.
సినిమా విడుదలైన తర్వాత ఒక్కోసారి కొన్ని సీన్స్ ని యాడ్ చేస్తుంటారు. అలాంటిది ఏమైనా జరిగి పృధ్వీ సీన్స్ ని సినిమా రిలీజ్ చేసిన తర్వాత యాడ్ చేస్తే, ఇప్పుడు పృధ్వీ పడుతున్న బాధకి అప్పుడు ఊరట కలుగుతుందని అంటున్నాయి సినిమా వర్గాలు.