మహేష్ నిర్మాతకు కొత్త టెన్షన్?

By Staff

Mahesh Babu
మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంకా పేరు పెట్టని చిత్రాన్ని నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఇప్పుడో కొత్త టెన్షన్ లో పడ్డారని తెలుస్తోంది. అయితే అది మహేష్ బాబు తోనో త్రివిక్రమ్ తోనో వచ్చింది కాదు. టిక్కెట్ రేట్లు తగ్గించాలని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిందంటున్నారు. ఎందుకంటే ఆయన మహేష్ బాబు,పవన్(పులి) లతో ప్రారంభించిన సినిమాలు రెండూ ఓవర్ బడ్జెట్ ఫిలిమ్సే. వాస్తవానికి ఆయన టికెట్ రేట్ హైక్ ని దృష్టిలో పెట్టుకుని తన బడ్జెట్ లను ప్లాన్ చేసుకున్నారు. ఇంతలో ఈ సినిమాలు ప్రారంభమయ్యాక ఈ టిక్కెట్లు రేటు తగ్గింపు నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. అందులోనూ అప్పుడే ఆ దెబ్బ కొన్ని పెద్ద సినిమాలు(బలాదూర్,శౌర్యం)లకు తగిలటం కళ్ళ ఎదురుగా కనపడటం జరిగింది.

దాంతో రమేష్ క్యాంప్ లో ఇదో చర్చనీయాంశంగా మారిందంటున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ రెండు సినిమాలు అనుకున్న బడ్జెట్ పెరగకుండా ఉండి సూపర్ హిట్టయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దానికి ఉదాహరణగా గతంలో త్రివిక్రమ్ ...మహేష్ తో మురళీ మోహన్ కి చేసిన అతడు సినిమాను ఉదాహరణగా చూపెడుతున్నారు. ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎక్కువకావటంతో అంత స్ధాయిలో హిట్టయినా పెట్టుబడి మాత్రమే వచ్చిందని అప్పటినుంచీ ఆయన సినిమా చేయలేదని చెప్తున్నారు. అటువంటి పరిస్ధితిని రమేష్ కి ఎదురుకాకూడదని కోరుకుందాం.ఎందుకంటే టేస్ట్ ఉన్న నిర్మాతలు మిగిలితేనే కదా మంచి సినిమాలు వచ్చేది అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X