Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చిరు-పూరి అవునో కాదో మరి?
చిరుత సినిమాకు దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తన 149వ చిత్రం రూపొందాలని చిరంజీవి భావిస్తున్నట్టు తాజా సమాచారం. ఈ సినిమాతోనే రాజకీయ అరంగేట్రం చేయాలని కూడా చిరంజీవి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 149వ సినిమా కోసం కృష్ణవంశి మొదలుకొని వివివినాయక్, గుణశేఖర్, శంకర్, పూరి జగన్నాథ్ ఇలా ఎన్నో పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ ఇపుడు చెన్నయ్ లోనే ఉన్నాడు. చిరంజీవి కూడా చెన్నయ్ కి వెళ్లి పూరి జగన్నాథ్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. పూరి కూడా రెడీ అన్నట్టు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ కూడా పూరి స్టార్ట్ చేసినట్టు పుకార్లు గుప్పుమంటున్నాయి. తన 149వ సినిమాను రానున్న 7 ఏడునెలల్లో పూర్తి చేసి రాజకియాలలోకి ఎంటర్ కావాలని చిరంజీవి ప్రణాళిక తో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల భొగట్టా. సినిమాను వేగంగా రూపొందించడంలో జగన్నాథ్ ది అందెవేసిన చేయిగా చెప్పుకుంటారు. అందుకే సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలను రూపొందించడంలో సిద్ధహస్తుడయిన వినాయక్ ను కాదని జగన్నాథ్ కు ఈ పనిని అప్పజెపుతున్నట్టు మరో పుకారు. మరి సామాజిక నేపథ్య కథతో సినిమాను రూపొందించిన నేపథ్యం పూరికి లేదు. ఈ కోణంలో ఆలోచించారో లేదో మరి.