Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరీ 'ఏక్ నిరంజన్' పైరసీ పై యుద్దం
ప్రభాస్, కంగనా రనౌత్ నాయకా నాయికలుగా పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఆదిత్యారామ్ నిర్మించిన 'ఏక్ నిరంజన్" చిత్రం ఇటీవలె విడుదలైంది. అయితే ఈ చిత్రంకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పైరసీ మార్కెట్ లో వీటిని అమ్మకానికి పెడుతున్నారు. దాంతో తమ ఏక్ నిరంజన్ చిత్రం పైరసీ చేస్తున్న వారిపై ఆదిత్యారామ్ మూవీస్ అధినేత ఆదిత్యారామ్ యుధ్ధం ప్రకటించారు. పైరసీని పూర్తి స్ధాయిలో నిరోధించటానికి రాష్ట్ర వ్యాప్తంగా క్లూస్ టీమ్ ఏర్పాటు చేసారు. ఈ సినిమా పైరసీ సిడిలు అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో క్లూస్ టీమ్ సాంబశివరావు ఆధ్వర్యంలో సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎర్రగడ్డ మార్కెట్లో రెండు మొబైల్ షాప్లపై యస్.ఐ.యాదయ్య నేతృత్వంలో దాడి చేసి పైరసీ సిడిలు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ "సనత్నగర్లో పైరసీ సిడిలు అమ్యుతున్నారన్న సమాచారం మా క్లూస్ టీమ్కు అందడంతో ఆదివారం పోలీసుల సహకారంతో సనత్నగర్లో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక సిడి షాప్లో కూడా పైరసీ సిడిలను పట్టుకోవడం జరిగింది. కడప పట్టణంలో కూడా పైరసీ సిడిలు అమ్ముతున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాం.
అవనిగడ్డ మండలం, మోపిదేవిలో ఈ పైరసీ సిడిలు తయారవుతున్నాయన్న సమాచారంతో అక్కడ కూడా దాడి చేసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇలా రాష్టవ్య్రాప్తంగా మా క్లూస్ టీమ్ పైరసీ సిడిలు అమ్ముతున్న వారిని పడ్బందీ పధకంతో అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తున్నాం. పైరసీ సిడిలు అమ్ముతున్న సమాచారం తెలిసినవారెవరైనా మాకు తెలియజేసిన పక్షంలో వారికి విలువైన బహుమతులు అందించనున్నాం" అన్నారు.