'పోకిరి'ని కూడా నేను కేవలం....పూరీ జగన్
సినిమాని చాలా తక్కువ బడ్జెట్లో తీయాలి అని అమితాబ్ ముందే చెప్పారు. అంతే కాదు... మొదటి రోజే డబ్బులు తిరిగి రావాలి అనే షరతు కూడా విధించారు. అనుకొన్నట్టుగానే విడుదలకు ముందే శాటిలైట్ రూపంలో లాభాలొచ్చాయి. నా దృష్టిలో కథ, కథనం, పాత్రల స్వభావం... ఇవే ముఖ్యం. ఎంత ఖర్చుపెట్టాం అనేది కాదు. మనమే హంగామాకుపోయి ఎక్కువ ఖర్చుపెట్టేస్తున్నాం. భారీదనం అనేది ఖర్చులో ఉండదు. 'పోకిరి'ని కూడా నేను కేవలం పది కోట్లలోనే తీశాను అన్నారు దర్శకులు పూరీ జగన్నాధ్. అమితాబ్ తో తీసిన బుడ్డా చిత్రం హిట్టయిన సందర్బంగా ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. అలాగే బుడ్డా చిత్రం కథ ఎలా తయారైందో చెప్తూ...ముందు 'నేను బీపీ షుగర్తో చావను. బుల్లెట్తోనే చస్తా..' అనే డైలాగు రాసుకొన్నా. దాన్ని ఆధారంగా మిగతా కథ రాశాను. వారం రోజుల్లో 'బుడ్డా' కథ సిద్ధమైపోయింది అన్నారు.


Click it and Unblock the Notifications











