జర్నలిస్టులందరూ గర్వపడేలా పవన్ కళ్యాణ్
హైదరాబాద్ :'పవన్కల్యాణ్ ఓ పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ అలరించే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి. జర్నలిస్టులందరూ గర్వపడేలా ఈ సినిమా వుంటుంది' అన్నారు పూరీ జగన్నాధ్. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'చిత్ర విశేషాలు పూరి జగన్నాథ్ మీడియాకు తెలియజేస్తూ ఇలా అన్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రెజిల్ సుందరి గాబ్రియాలా ఓ ఐటం సాంగ్ లో కనిపించనుంది.
పవన్కల్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. స్పెషల్ నైట్ ఎఫెక్ట్స్తో ఫైట్స్ తెరకెక్కిస్తున్నారు. మరో రెండు రోజులు అక్కడే షూటింగ్ జరుగనుంది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత డి.వి.వి.దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్ కామెంట్ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు.
ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా మంచి క్రేజ్ తో మొదలైంది. అలాగే 'గబ్బర్సింగ్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్ సినిమాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. అక్టోబర్ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











