Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
మహేష్ బాబు వివాదం: దాన్ని ఇంకా పెంట చేయడం ఇష్టం లేదన్న పూరి!
Recommended Video
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇష్మార్ట్ శంకర్'. నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జులై 18న విడుదలైన బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళ్లడంతో చిత్ర బృందంతో పాటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషంగా ఉన్నారు.
సినిమాను ప్రమోట్ చేయడానికి పూరి, ఛార్మి, నిధి అగర్వాల్, నభా నటేష్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలు పర్యటిస్తున్నారు. బుధవారం విజయవాడలో పూరి మీడియాతో మాట్లాడుతూ... సిద్ధిపేట్, కర్నూలు, అనంతపూరంలో పర్యటించి ఇపుడు విజయవాడ వచ్చాం. ఏలూరు, భీమవరం ఇలా వైజాగ్ వరకు ప్రతి రోజూ ఒక సిటీకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. నిధి అగర్వాల్, నభా మాతో ఉన్నారుకానీ ఇస్మార్ట్ శంకర్ ఒక్కడే లేడని తెలిపారు.
మాస్ సినిమా పొటెన్షియల్ ఏమిటో చెప్పిన సినిమా
మా ఇస్మార్ట్ శంకర్ మూవీ సక్సెస్ అయింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. సక్సెస్ కంటే మ్యాడ్ నెస్, క్రేజ్ క్రియేట్ చేసిన సినిమా ఇది. యూత్ సాంగ్స్, డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాస్ సినిమా పొటెన్షియల్ ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తాను... అని పూరి తెలిపారు.
|
సినిమాలకు సీజన్ అంటూ ఏమీ ఉండదు
సినిమాలకు సీజన్ అంటూ ఏమీ ఉండదు. సినిమా నచ్చితే జనం నెత్తిన పెట్టుకుంటారు అనడానికి ఇస్మార్ట్ శంకర్ ఉదాహరణ. విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరూ సినిమా బావుందని అంటునం మాకు మరింత ఎనర్జీని ఇస్తుందని పూరి తెలిపారు.
ఇస్మార్ట్ శంకర్ కాపీ ఆరోపణలపై
‘ఇస్మార్ట్ శంకర్' కథ నాదే అంటూ నటుడు ఆకాష్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పూరి స్పందించారు. ఆకాష్కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన్ను ఎప్పుడూ నేను కలవలేదు. ఏవో ఎలిగేషన్స్ వస్తూనే ఉంటాయని పూరి స్పష్టం చేశారు.
మహేష్ బాబు వివాదాన్ని ఇంకా పెంట చేయడం ఇష్టం లేదు
నేను హిట్లలో ఉంటేనే మహేష్ బాబు సినిమా చేస్తాడు... లేకుంటే చేయడు అంటూ పూరి జగన్నాధ్ చేసిన కామెంటుపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పూరిని ట్రోల్ చేస్తూ తమ ప్రతాపం చూపిస్తున్నారు. దీనిపై పూరి తాజాగా పూరి స్పందిస్తూ... ‘ఆల్రెడీ ట్రోల్ అవుతోంది అంటున్నారు. మళ్లీ దాన్ని గెలికి పెంటచేయడం ఎందుకు? ఆ విషయాలు ఇప్పుడు వద్దు' అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.