Don't Miss!
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- News ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అప్పటికే సగం జీవితమైపోయిందట.. పూరి జగన్నాథ్ నేర్చుకున్న గుణపాఠమిదే!!
తెలుగు చిత్ర సీమలో పూరి జగన్నాథ్ మోసపోయినట్టుగా మరేతర దర్శకుడు కూడా మోసపోలేదనుకుంటా. నమ్మిన వారే నిండా ముంచేశారు. పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఎలాంటి ఫాంలో ఉండే, దర్శకుడిడగా ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాడు.. ఎంత సంపాదించాడు.. మోసపోయి ఎంత పోగొట్టుకున్నాడనే విషయాలను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి తన జీవితంలో ఎదురైనా అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకుని పాడ్ కాస్ట్ ద్వారా ఓ చక్కని సందేశాన్ని ఇచ్చాడు.
నా అంత ఎవ్వరూ సంపాదించలేదు..
టాలీవుడ్ డైరెక్టర్లు ఎవ్వరూ కూడా నా అంత సంపాదించలేదు.. నేను తీసుకున్నంత రెమ్యూనరేషన్ ఎవ్వరూ కూడా తీసుకోలేదంటూ పూరి జగన్నాథ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే మేనేజర్ను నమ్మడం, దాదాపు వంద కోట్లు కాజేయడం, అలా రోడ్డున పడటంతో పూరి జగన్నాథ్ జీవితం మొత్తం మారిపోయింది.
అక్కడి నుంచి మళ్లీ..
అలా రోడ్డు మీద పడిపోయిన పూరి జగన్నాథ్ మళ్లీ లేచాడు. ఎగిసిపడే అలల్లా కెరటాల్లా దూసుకొచ్చాడు. మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. అలాంటి క్లిష్ట సమయంలో అలీ, ఛార్మీ వంటి వారు ఎంత సాయం చేశారో పూరి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు.
ట్రాష్ బ్యాగ్ గురించి..
చెత్త సంచి గురించి చెబుతూ.. మనం ఎదగాలంటే మన చుట్టూ చెత్త ఉంచుకోకూడదు.. సగం చెత్త మనుషుల రూపంలోనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. జీవితంలో నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోవాలంటే, అనవసరమైన లగేజ్తో బయలుదేరకూడదు. కొండకు తాడుకట్టి, దాన్ని పట్టుకుని ఎక్కుతున్నప్పుడు నీకు నువ్వే బరువు, దానికి తోడు కొంతమంది నిన్ను పట్టుకుని వేలాడుతుంటే ఇంకేం ఎక్కుతావు. నీతోపాటు వీళ్లందరినీ పెట్టుకుంటే నిన్ను కొండ ఎక్కకుండా ఆపుతుంటారు అని చెప్పుకొచ్చాడు.
సగం జీవితమైపోయింది..
మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. సగం చెత్త మనుషుల రూపంలో ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసే సరికి సగం జీవితం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. గుర్తు పెట్టుకోండి ట్రాష్ బ్యాగ్స్ ఎప్పుడూ నవ్వుతూ, మనతో మాట్లాడుతూ, మనతోనే ఉంటాయి. వాటిమీద ట్రాష్ బ్యాగ్స్ అని రాసి ఉండదు. మనమే గుర్తుంచుకోవాలి అంటూ తన జీవితాన్నే గుణపాఠంగా మల్చుకున్నాడు పూరి జగన్నాథ్.