Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్స్వే కాదు.. హీరోల **ల్స్ కూడా పిసికేస్తారు.. అంత శాడిస్టులు ఉన్నారు.. పూరీ సెన్సేషన్
Recommended Video
పూరీ జగన్నాథ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్. ఒకప్పుడు భారీ హిట్ చిత్రాలను అందించిన ఈ దర్శకుడు కొద్ది సంవత్సరాలుగా హిట్ అన్న మాటకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాలు చేసినా సఫలం కాలేదు. జూనియర్ ఎన్టీఆర్తో చేసిన 'టెంపర్' తర్వాత పూరీ చేసిన చిత్రాలన్నీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. అయితే, తాజాగా యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్తో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం ఆ లోటును పూడ్చేసింది. పూరీని తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించింది. దీంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఇస్మార్ట్ సక్సెస్
ఎనర్జిటిక్ స్టార్ రామ్తో పూరీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా గత గురువారం విడుదలైంది. మొదట మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్నప్పటికీ, క్రమంగా హిట్ సినిమాగా మారిపోయింది. పక్కా మాస్ సినిమానే అయినా కుటుంబ ప్రేక్షకులు సైతం బాగానే వస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుండడంతో పాటు భారీ కలెక్షన్లను సాధిస్తోంది.
హిట్ను ఎంజాయ్ చేస్తూ..
పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత హిట్ను చూడడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మధ్యే తన గురువు రాంగోపాల్ వర్మతో కలిసి ఈ సినిమా సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ గురించి సంచలన విషయాలు
ఈ మధ్య పూరీ జగన్నాథ్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఎన్నో ఒడిదుడుకులకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ ప్రవర్తనపై సంచలన విషయాలను బయట పెట్టారు. దీంతో పూరీ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
హీరోయిన్స్వే కాదు.. హీరోల బాల్స్ కూడా పిసికేస్తారు
ఎవరూ చెప్పలేని మేటర్ ఒకటి చెబుతాన్న పూరీ ‘‘హీరోయిన్స్ పబ్లిక్లోకి వెళ్తే పట్టుకుని లాగేస్తారు.. నొక్కేస్తారు.. బట్టలు చింపేస్తారు.. ఇవన్నీ చేస్తారని మీకు తెలుసు. హీరోలు బయటకెళ్లినా అలాగే చేస్తారని మీకు తెలుసా..? హీరోల బాల్స్ పట్టుకుని నొక్కేస్తారు. అది కూడా మగవాళ్లే. ప్రతీ హీరోకు ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ, ఎవరూ బయటకు చెప్పలేదు'' చెప్పుకొచ్చారు.
అంత శాడిస్టులు ఉన్నారు
ఫ్యాన్స్ రూపంలో కొందరు ఏమేం చేస్తారో వివరిస్తూ.. ‘‘హీరోలు బయటకెళ్లినప్పుడు ఎదురుగా ఎవరైన వస్తే వీళ్లేం చేస్తారోనని భయపడతారు. అంత శాడిస్ట్ నాకొడుకులు ఉన్నారు. వాచ్లు ఎత్తుకెళ్లిపోతారు. చేతిలో ఫోన్ ఉంటే లాక్కెల్లిపోతారు. చేతికున్నవి తెంపేస్తుంటారు. చైన్లు లాగేస్తుంటారు'' అని పూరీ వెల్లడించాడు.