Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరి జగన్నాథ్ మొండిగా.. ఆ విషయంలో కమిట్ అయ్యాడట.. కొడుకు పరిస్థితే కష్టంగా..
టాలీవుడ్లో సెన్షేషనల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే పూరి జగన్నాథ్ అని చెప్పవచ్చు. రవితేజకు స్టార్ హోదాను కల్పించిన పూరీ ఆ తర్వాత ప్రిన్స్ మహేష్కు ఇండస్ట్రీ హిట్ను అందించాడు. అలా ఒక్కో హీరోకు మైలు
టాలీవుడ్లో సెన్షేషనల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే పూరి జగన్నాథ్ అని చెప్పవచ్చు. రవితేజకు స్టార్ హోదాను కల్పించిన పూరీ ఆ తర్వాత ప్రిన్స్ మహేష్కు ఇండస్ట్రీ హిట్ను అందించాడు. అలా ఒక్కో హీరోకు మైలురాయిగా నిలిచే సినిమాను అందించిన పూరి ఇప్పుడు తన కుమారుడు ఆకాశ్ను హీరోగా నిలబెట్టడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ తాను నిర్మించిన మెహబూబా రిలీజ్ విషయంలోనే కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.
Recommended Video
సవాల్తో పూరీ జగన్నాథ్
ఇటీవల కాలంలో పూరీకి గట్టిగా చెప్పుకొనే హిట్ లేదు. పైసా వసూల్ సినిమాను పక్కన పెడితే దాదాపు ఇటీవల చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాయి. అలాంటి పరిస్థుతుల్లో ఆకాశ్ను హీరోగా నిలబెట్టడమే కాకుండా.. తన కెరీర్లో ఓ సూపర్హిట్ను ఖాతాలో వేసుకొనే ఓ సవాల్ను స్వీకరించాడు.
అపవాదును మూటగట్టుకొని
ఎంతోమంది హీరోలకు మంచి విజయాలను అందించిన పూరి తన కుమారుడిని లాంచ్ చేసే విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని అపవాదును మూటగట్టుకొన్నాడు. ఆంధ్రపోరి అనే చిత్రం ద్వారా ఆకాశ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది.
విడుదల విషయంలో మొండిగా
ఇలాంటి పరిస్థితుల్లో తనపైన ఉన్న అపప్రదను తొలగించుకోవడానికి సొంత బ్యానర్లోనే కొడుకు ఆకాశ్ను హీరోగా పెట్టి మెహబూబా అనే సినిమాను పూరీ తీశాడు. అయితే మెహబూబా రిలీజ్ విషయంపై సినీ వర్గాల్లో ఓ చర్చ నడుస్తున్నది. తనను తాను ప్రూవ్ చేసుకోవడమే కాకుండా కొడుకు సూపర్ హిట్ ఇచ్చే బాధ్యతను ఎత్తుకొన్న పూరీ ఆలోచన విధానం సరిగాలేదంటున్నారు. మెహబూబా చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసే అంశాన్ని కొందరు తప్పుపడుతున్నారనేది తాజా సమాచారం.
స్టార్లతో పోటీకి పూరీ సిద్ధం
ఈ ఏడాది వేసవికి భారీ సినిమాల మధ్య పోటీ రంజుగానే ఉన్నది. మార్చి చివరి వారంలో రిలీజ్ అయ్యే రంగస్థలం, ఏప్రిల్ 27న మహేష్బాబు నటించిన భరత్ అను నేను, అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రాలతోపాటు రజనీకాంత్ కాలా సినిమా కూడా రిలీజ్కు సిద్దమవుతున్నది.
రిస్క్ చేస్తున్న పూరీ జగన్నాథ్
సూపర్స్టార్ల సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పూరి మెహబాబా చిత్రాన్ని విడుదల చేయడం పెద్ద రిస్క్ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తన సినిమాల రిలీజ్ విషయంలో పూరి జగన్నాథ్ మొండిగానే కాకుండా ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడని పేరున్నది. కాకపోతే తన కుమారుడి కెరీర్ను దృష్టిలో ఉంచుకొని మెహబూబా కాస్తంత ఆచీతూచి అడుగులు వేయాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
క్రేజీ ప్రాజెక్ట్తో ఆకాశ్ పూరీ
తన కుమారుడు ఆకాశ్ను భారీ రేంజ్లో హీరోగా నిలబెట్టేందుకు క్రేజీ ప్రాజెక్ట్ను డిజైన్ చేశాడు పూరీ. ఇండో-పాకిస్థాన బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం. ఈ సినిమాలోని కీలక ఘట్టాలను రిస్క్ చేసి మరీ దేశ సరిహద్దుల్లో చిత్రీకరించాడు పూరీ జగన్నాథ్. ఇంత కష్టపడి తీసిన ఈ సినిమాను తగదునమ్మా అంటూ సమ్మర్ కు విడుదల చేయడం ఎంతవరకూ సబబు అనేది వారి ప్రశ్న!