Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఫ్యాన్స్ ని ఎప్పుడూ ఎక్జయిట్ చేస్తూనే ఉండాలి....: పూరి
సాధారణంగా ఎవరైనా మంచి సినిమా తీయాలనీ, చేయాలనీ అనుకుంటారు. కానీ ఆ ఆలోచన వస్తే వాళ్ల కెరీర్ నాశనమే అని చెబుతున్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్. దర్శకుడు అన్నవాడు వరుసగా కమర్షియల్ సినిమాలు తీసుకుంటూ పోవాలి. ఎప్పుడైనా మంచి సినిమా తీయాలన్న ఆలోచన వస్తే అతడి నాశనం అక్కడ మొదలైనట్లే అంటున్నారు.
పదిమందికి మంచి జరిగే సినిమా అని 'నేనింతే' తీశా. ఫ్లాపయింది. నేనే కాదు, ఏ దర్శకుడైనా ఎప్పుడూ ఏదో కొత్త పాయింట్ చెప్పి ఎదుటివాళ్లని ఎక్జయిట్ చేస్తూనే ఉండాలి. లేకుంటే అక్కడ పడిపోతాం. అన్ని సందర్భాల్లోనూ అవతలివాళ్లని ఆశ్చర్యానికి గురిచేయడం కుదరదు. అప్పుడు మనల్ని పట్టించుకునేవాళ్లు ఉండరు. మన ఫోన్లను రిసీవ్ చేసుకునే వాళ్లుండరు. అందుకే వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి అని ఆయన వివరించాడు.
ప్రస్తుతం మహేష్ హీరోగా ఆయన డైరెక్ట్ చేస్తున్న 'బిజినెస్ మేన్' జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న బిజినెస్ మెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దూకుడు లో లాగే బిజినెస్ మెన్ లో కూడా పంచ్ డైలాగ్ లు ఉంటాయన్న విషయం ట్రైలర్ లో మరో సారి కనిపిస్తుంది. దూకుడు డైలాగ్ లు ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిందే. మహేష్, పూరిల పోకిరి డైలాగ్స్ రేంజ్ లోనే బిజినెస్ మెన్ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తుంది. బిజినెస్ మెన్ లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఎక్కువ ఉండన్నున్నాయట.