Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాయల భోగం అనుభవిస్తున్న పూరి
అలనాటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అనుభవించిన భోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వతహాగా కవి, కళా పోషకుడు అయిన రాయలవారు కవులను, కళాకారులకు తన ఆస్థానంలో ప్రత్యేక స్థానం కల్పించారు. రోజూ తన దర్చార్లో వారితో కలిసి కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ, సంగీతం వింటూ ఉండే వారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాయల మాదిరి భోగాలు అనుభవిస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. వినడానికి ఆశ్చర్య కరంగా ఉందా? అయితే కింది మ్యాటర్ పై ఓ లుక్కేయండి...
టాలీవుడ్లో అగ్రదర్శకుడిగా ఎదిగిన తర్వాత పూరి జగన్నాథ్.....మాదాపూర్లో ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాడు. అందులో అన్ని హంగులు ఉన్నాయండోయ్. రోజు పూరి దగ్గరకు కథలు, కవిత్వాలు, కామెడీ బిట్లు, పాటలు వినిపించడానికి అనేక మంది రచయితలు, కవులు వస్తుంటారు. పూరీకి కూడా ఇలాంటి వాటిపై చాలా ఆసక్తి. అందుకే వారిని ప్రోత్సహిస్తూ ...వారు చెప్పినవి నచ్చితే తన సినిమాకు పని చేయడానికి అవకాశం కల్పిస్తుంటాడు.
ఇలాంటి వారి కోసం పూరి తన ఆఫీసులో ప్రత్యేక హాలును ఏర్పాటు చేశాడు. ఆ హాలు రాయల దర్భాన్ ను తలపించేదిగా ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం తన కోసం వచ్చిన కవులు, రచయితలన తన చుట్టూ కుర్చో పెట్టుకుని వారు చెప్పే కథలు, కవిత్వాలు, పాటలు వింటూ రాయల భోగం అనుభవిస్తున్నాడు.
రాయల దర్భర్తో పోల్చితే పూరి దర్భార్కు ఒక్కటి తక్కువైందిన. రాయల ఆస్థానంలో రాజనర్తకి ఉండేంది. ఆదునిక కాలం కాబట్టి క్లబ్ డాన్సర్ లాంటి వాళ్లు ఉండాలి. మన రాష్ట్రంలో అలాంటి విషేదం కదా...అనుమతి ఉండి ఉంటే టాలెంట్ సెర్చ్ పేరుతో తన దర్చార్లో రోజుకో నర్తకితో స్టెప్పులేయించే వాఃడేమో?