Don't Miss!
- Sports DC vs RR: కొంపముంచిన మోహిత్ శర్మ.. రిషభ్ పంత్ విధ్వంసం!
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఖైదీ రీమేక్ విషయమై పూరీ జగన్నాధ్
రెండు రోజుల క్రితం మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఖైదీ చిత్రం రీమేక్ రానుందంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది విన్న వారంతా వర్మ కావాలనే చిరంజీవి కెలకటానికి చేసిన పని అనుకున్నారు.అయితే పూరీ ఈ చిత్రం నిజంగానే ఉంటుందని అంటున్నారు.ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..ఖైదీ రీమేక్ ఆలోచన తనకు మూడు సంవత్సరాల క్రితమే వచ్చిందని అన్నారుఅలాగే తాను చిరంజీవి అభిమానిని అని అప్పటినుంచి దానిపైనే వర్క్ చేస్తున్నట్లు చెప్పారు.అలాగే పూరీ చెప్తూ..ఖైదీ తన ఫేవెరెట్ చిత్రం అనీ.అది ఓ కల్ట్ ఫిలిం అనీ అన్నారు.ఇక ఖైదీ రీమేక్ ని రామ్ చరణ్ తో గతంలో చేయాలని పూరీ జగన్ ప్లాన్ చేసారు. కానీ ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు.అప్పటికీ ఖైధీ మీద ప్రేమతో అలీతో ఓ ఎపిసోడ్ ని దేశముదరు చిత్రంలో పూరీ జగన్నాధ్ పెట్టడం జరిగింది.ఇక ఈ రీమేక్ జరిగినా జరగకపోయినా దీని గురించి విన్న వారు మాత్రం...మహేష్ ..చిరంజీవిగా కనపించటం మాత్రం ధ్రిల్లింగ్ అనిపించే అంశం. అలాగే పూరీ టేకింగ్ తో ఇప్పుడు ఖైది రీమేక్ అంటే చాలా బాగుంటుంది. సినిమా ప్రారంభమయితే బాగుండును అంటున్నారు.
పూరీ జగన్ ప్రస్తుతం మహేష్ తో ది బిజెనెస్ మ్యాన్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్మ్యాన్'గా టైటిల్కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.