twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చిత్రం

    By Srikanya
    |

    సింహా విజయం బాలయ్యకు మంచి కిక్ ఇస్తోంది. పోకిరి వంటి చరిత్ర తిరగరాసిన చిత్రం తీసిన పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ బుక్కయ్యారు. ఇంతకుముందు బాలకృష్ణ హీరోగా 'చెన్నకేశవ రెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్ తిరిగి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి బెల్లంకొండ సురేష్ మీడియాకుతో మాట్లాడుతూ 'బాలయ్యబాబు, పూరి జగన్నాథ్‌ ల ఫస్ట్ కాంబినేషన్ ‌లో ఓ అద్భుతమైన చిత్రాన్ని మా బేనరులో నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. బాలయ్యబాబు కెరీర్‌లోనే ఓ సెన్సేషనల్ మూవీగా నిలిచేవిధంగా హై రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. పూరి జగన్నాథ్, బాలయ్య బాబు కాంబినేషన్ అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటికి ధీటుగా ఈ చిత్రం సబ్జెక్ట్ ఉంటుంది. 'చెన్నకేశవ రెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాల తర్వాత బాలయ్యబాబుతో మా బేనరులో నిర్మిస్తున్న ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం. త్వరలో ప్రారంభమయ్యే ఈ ప్రిస్టేజియస్ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు అతి త్వరలో తెలియచేస్తాం' అన్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్...తన లేటెస్ట్ చిత్రం గోలీమార్ ప్రి రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X