Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరీ కొత్త చిత్రం'రోగ్' హీరో ఈ కుర్రాడే...! (ఫొటో)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తరువాత ప్రాజెక్టు టైటిల్తో సహా హీరోను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తూ 'రోగ్' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇషాన్ ఫొటోను కూడా పూరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Launching
a
dashing
new
hero
ISHAN
In
my
next
film
#ROGUE
shoot
starts
from
Nov
pic.twitter.com/8RA9TMq24S
—
PURI
JAGAN
(@purijagan)
October
5,
2015
గతంలో పూరి జగన్నాథ్...చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ని హీరోగా లాంచ్ చేస్తూ చిరుత చిత్రం రూపొందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఆయన డైరక్షన్ లో చేయాలని కొత్త కుర్రాళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో ఆయనకు ఇప్పుడు కర్ణాటక నుంచి రెండు ఆఫర్స్ వచ్చాయి. ఇద్దరు హీరోలను లాంచ్ చేస్తున్నారు.
కర్ణాటకలోని గంగావతి ఏరియాకు చెందిన నిర్మాత సిఆర్ మనోహర్ మేనల్లుడు ఇషాన్ ని ఇప్పుడు లాంచ్ చేస్తూ నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
సిఆర్ మనోహర్...తెలుగు హీరో శ్రీకాంత్ కు సన్నిహిత మిత్రుడు. శ్రీకాంత్ తో ఆయన గతంలో మహాత్మ చిత్రం నిర్మించారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ కు ఆయన భారీ రెమ్యునేషన్ ఇచ్చి మరీ తన మేనల్లుడుని హీరోగా ఇచ్చాడని చెప్తున్నారు.