Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరోయిన్ కి పూరీ జగన్నాధ్ ప్రత్యేక క్లాసులు
పూరీ జగన్నాధ్ కి ముంబైలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కంపెనీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ రుణం తీర్చుకోవాలనుకున్నాడో ఏమో గానీ ఆమెకు కొన్ని ప్రత్యేక క్లాసులు చెప్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అవి విన్న కంగనా రౌనత్ రీసెంట్ గా క్రిటిక్స్ ని తిడుతూ మీడియా లో ఫైర్ అయిపోయింది. తన తాజా చిత్రం తను వెడ్స్ మను లో తాను అధ్బుతంగా నటించినా అంతా మాధవన్ నే పొగిడారని, తన నటనను నెగ్లెట్ చేసారని, అయినా కలెక్షన్స్ కు లోటు లేదని ,రివ్యూలు చదివి ఎవరూ ధియోటర్స్ కు రారని ఓ రేంజిలో విరుచుకుపడింది.
దానికి కారణం ఆమెతో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పూరీ జగన్నాధ్ అంటున్నారు. అమితాబ్ తో బుడ్డా చిత్రం రూపొందిస్తున్న పూరీ కి ఆమె అక్కడ గైడ్ లా మారింది. ఇక పూరితో ఆమె ఏక్ నిరంజన్ చిత్రం చేసింది. అలాగే పూరి మాటలు విని రామ్ గోపాల్ వర్మ కూడా తన తాజా చిత్రం కథ,స్క్ర్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజు చిత్రంలో వెబ్ సైట్ రివ్యూలు మీద సెటైర్స్ వేసాడని అంటున్నారు. మొత్తానికి పూరి జగన్నాధ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడన్నమాట.