Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రవితేజ 'ఇడియట్ 2' ఆపేసారు ఎందుకంటే..
హైదరాబాద్: రవితేజ అబిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇడియట్ 2 సినిమా ఆగిపోయింది. కొంత కాలం క్రిందట పూరీ జగన్నాధ్ ..మళ్లీ తాను రవితేజతో ఇడియట్ 2 చిత్రం చేస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడా ప్రాజెక్టు లేదని పూరీ జగన్నాధ్ తేల్చి చెప్పేసారు. హైదరాబాద్ లో తాజాగా జరిగిన దేముడు చేసిన మనుష్యులు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయం తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ... నేను మొదట రవితేజతో ఇడియట్ 2 చేద్దామని ప్లాన్ చేసాను. కానీ ఒక్కసారి ఆ సినిమా మొత్తం రివ్యూ చేసుకుని మనస్సు మార్చుకున్నాను అన్నారు.
రీసెంట్ గా బ్యాంకాక్ లో ఈ చిత్రం చూసిన ఆయన చంటి పాత్రకి మళ్లీ మసాలా ని యాడ్ చేయటం కష్టమని భావించాని చెప్పారు. అలాగే ఆ నిర్ణయానకి వచ్చిన వెంటనే రవితేజను పిలిచి ఒరిజనల్ క్యారెక్టర్ లోని డైనమిజం కోల్పోతుందని సినిమా చెయ్యనని చెప్పాను. ఇంక ఎప్పటికీ ఆ సినిమాకు సీక్వెల్ చేయను అని చెప్పారు. ఇక రవితేజ, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ వచ్చి సూపర్ హిట్టయిన చిత్రం ఇడియట్. ఈ చిత్రం సీక్వెల్ ఇడియట్ -2 చిత్రంకి సంభందించిన ప్రకటనను అప్పట్లో దర్శకుడు పూరీ జగన్నాధ్ మీడియాకు విడుదల చేసారు.
ఇక ఈ ప్రకటన విషయమై అప్పట్లో పూరీ మాట్లాడుతూ... అప్పట్లో ఇడియట్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని చాలా డిఫెరెంట్ గా ఫీలయ్యారు. ఇడియట్ 2 కూడా డెఫినెట్ గా ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా స్క్రిప్టు రెడీ చేస్తున్నాను. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన వివరాలు తెలియచేస్తాను. రవితేజ కాంబినేషన్ లో నేను చేస్తున్న మరో పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇడియట్ 2 అన్నారు. అయితే ఇప్పుడా నిర్ణయం మార్చుకుని అభిమానులను నిరాశపరిచారు.
రవితేజ, ఇలియానా జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్ నిర్మించిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సోమవారంనాడు పూరీ జగన్నాథ్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ... 'కథేలేని కథ ఉన్న చిత్రమిది. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను రెండు గంటలపాటు నవ్విస్తుంది. మ్యూజిక్ సూపర్ హిట్టవుతుంది. సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకముంది' అని చెప్పారు.