Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరి తనయుడి రొమాంటిక్ సినిమా ఆగిపోలేదు.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేశారు
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పూరి జగన్నాథ్ కొడుకును ఎలాగైనా ఒక సరైన ట్రాక్ లోకి తేవాలని ఫోకస్ పెడుతున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ దర్శకుడు కెరీర్ లో దాదాపు తెలుగులో అందరి హీరోలతో వర్క్ చేసి హిట్ కొట్టాడు. అదే తరహాలో సొంత కొడుకుతో కూడా సక్సెస్ కొట్టాలని ప్లాన్ వేశారు. మొదట ఆకాష్ పూరిని మెహబూబా సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకున్నారు.
అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు. మొత్తానికి పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చేశారు. ఇక విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బిజీగా ఉండడం వలన ఈ సారి కొడుకు సినిమాను తను డైరెక్ట్ చేయకుండా శిష్యుడు అనిల్ కు అప్పగించాడు. రొమాంటిక్ కథను సొంతంగా రాసుకున్న పూరి సినిమాను సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తయ్యింది.
అసలైతే సినిమాను ఇక రిలీజ్ చేసే అవకాశం లేదని కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ఇక రూమర్స్ కు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. మార్చ్ 1న సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వబోతున్నట్లు పోస్టర్ ను కూడా విడుదల చేశారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కొత్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తోంది. మరి ఈ సినిమాతో ఆకాష్ ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.