Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఫ్యాన్స్తో పవన్ కళ్యాణ్ షూటింగ్ డేట్ ఫిక్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో అభిమానులతో కలిసి కొన్ని సీన్లు చిత్రీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా షూటింగుకు సంబంధించిన డేట్, ప్లేస్ ఖరారు చేసారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ మేరకు తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వివరాలు పోస్టు చేశారు.
'కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రానికి సంబంధించిన షూటింగులో పాల్గొనబోతన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఆహ్వానం. రేపటి (ఆగస్టు 9) నుంచి ఆగస్టు 12 వరకు షూటింగ్ జరుగుతుంది. ఉదయం 9గంట లనుంచి సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది' అని పూరి ట్వీట్ చేశారు.
పవన్, తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సంగీతం : మణిశర్మ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.