Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఇడియట్-2 కాదు...‘టూ ఇడియట్స్’
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆ మధ్య వచ్చిన ఇడియట్ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ సినిమా సీక్వెల్ గా ఇడియట్-2 సినిమా తీస్తున్నట్లు గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం....ఆ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాథ్ 'టూ ఇడియట్స్' అనే టైటిల్ ఖరారు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం స్క్రిప్టుపై కసరత్తు జరుగుతోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
రవితేజ-ఇలియానా ఇందులో రొమాన్స్ చేయనున్నారు. సినిమా టైటిల్ కు తగిన విధంగా రవితేజ, ఇలియానా ఇడియట్ బిహేవియర్ తో సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నారని దర్శకుడు పూరి జగన్నాథ్ వెల్లడించారు. రవితేజ-ఇలియానా కలిసి రొమాన్స్ చేయడం ఇది మూడో సారి. ఇదివరకే ఈ ఇద్దరు ఖతర్నాక్, కిక్ సినిమాల్లో కలిసి నటించారు.
ప్రస్తుతం రవితేజ నిప్పు సినిమా షూటింగులో బిజీగా ఉండగా, పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోన్నారు. అనంతరం టూ ఇడియట్స్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.