Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
పూరీ చెప్పిన సబ్జెక్టు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది!:ప్రిన్స్ మహేష్
'పోకిరి" కాంబినేషన్లో మరోసారి రిపీట్ అవుతోంది. మహేష్ హీరో గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రంగురించి మహేష్ మాట్లాడుతూ- పూరీ జగన్నాథ్ చెప్పిన సబ్జెక్టు ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. మళ్లీ మా కాంబినేషన్లో ఇది ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- కథ విని మహేష్ బాగా ఇన్స్పైర్ అయ్యారు. పోకిరి తర్వాత మా కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం మళ్లీ కొత్త రికార్డు సృష్టిస్తుందని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ మహేష్, పూరీల కాంబినేషన్లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్గా రికార్డు సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్లో మా సంస్థపై చాలా ప్రెస్టీజియస్గా చిత్రాన్ని రూపొందిస్తాం. మేలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుతం మహేష్...శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నారు. ఇక పూరీ జగన్నాధ్...రానా హీరోగా నేనూ నా రాక్షసి చిత్రం రూపొందించి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు.