twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్నాధ్ 'నేను.. నా రాక్షసి' లేటెస్ట్ ఇన్ఫో ...

    By Srikanya
    |

    దగ్గుపాటి రాణా, ఇలియానా జంటగా నటిస్తోన్న చిత్రం 'నేను..నా రాక్షసి'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. నల్లమలపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మాత. అభిమన్యు సింగ్‌, ఇలియానా, రాణాపై యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. వేనిస్‌, బ్యాంకాక్ ‌లలో పాటల చిత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'95 శాతం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. మిగతాది హైదరాబాద్‌ లో పూర్తచేయనున్నాం. జగన్‌ తో పనిచేయడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు. సంక్రాంతి కానుకగా తీసుకురావటానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు.

    ఇక ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్‌ రాథోడ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X