Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పూరీకి అమితాబ్ ఇంకా సెటిల్ చెయ్యలేదని...
పూరీ జగన్నాధ్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైరక్టర్ గా ఎగ్రిమెంట్ అయినప్పుడు ఎబి ఫిల్మ్ కార్పోరేషన్,స్టూడియో 18 వారు లాభాల్లో 33% షేర్ ఇస్తామని చెప్పటం జరిగింది. అయితే ఇప్పటివరకూ ఆ సెటిల్ మెంట్ జరగలేదని ముంబైకి చెందిన ఓ పాపులర్ దిన పత్రిక కథనం ప్రచురించింది. అయితే పూరితో అమితాబ్ మరో రెండు చిత్రాలు కమిటయ్యారని, డబ్బు సంగతి ఎలా ఉన్నా ఆ డాక్యుమెంట్స్ పంపితే తాను ఇనకం టాక్స్ రిటర్న్ ఫైల్ సబ్ మిట్ చెయ్యాలని పూరీ కోరటం జరిగింది. అయితే అంతకుముందు ప్రొడ్యూసర్స్ ఆ డాక్యూమెంట్స్ పంపటం జరిగింది కానీ వాటిపై కావాల్సిన సంతకాలు లేవు. ఈ విషయమై పూరీ ఇప్పటికీ అమితాబ్ ఆఫీసును సంప్రదిస్తూనే ఉన్నారు.
ఇక ఈ విషయమై స్టూడియో 18 సిఇవి విక్రమ్ మల్హోత్రా మాట్లాడుతూ.. మేము మా పాలసీ ప్రకారం ఏ కమర్షియల్ మ్యాటర్ పైనా కామెంట్ చెయ్యకూడదు. అయితే త్వరలోనే ఈ ఇష్యూ మొత్తం సెటిల్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు. ఇక పూరీ జగన్నాధ్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ లో బిజగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా, కాజల్ కాంబినేషన్ లో ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని, టీజర్ ని విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.