twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీకి అమితాబ్ ఇంకా సెటిల్ చెయ్యలేదని...

    By Srikanya
    |

    పూరీ జగన్నాధ్, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డైరక్టర్ గా ఎగ్రిమెంట్ అయినప్పుడు ఎబి ఫిల్మ్ కార్పోరేషన్,స్టూడియో 18 వారు లాభాల్లో 33% షేర్ ఇస్తామని చెప్పటం జరిగింది. అయితే ఇప్పటివరకూ ఆ సెటిల్ మెంట్ జరగలేదని ముంబైకి చెందిన ఓ పాపులర్ దిన పత్రిక కథనం ప్రచురించింది. అయితే పూరితో అమితాబ్ మరో రెండు చిత్రాలు కమిటయ్యారని, డబ్బు సంగతి ఎలా ఉన్నా ఆ డాక్యుమెంట్స్ పంపితే తాను ఇనకం టాక్స్ రిటర్న్ ఫైల్ సబ్ మిట్ చెయ్యాలని పూరీ కోరటం జరిగింది. అయితే అంతకుముందు ప్రొడ్యూసర్స్ ఆ డాక్యూమెంట్స్ పంపటం జరిగింది కానీ వాటిపై కావాల్సిన సంతకాలు లేవు. ఈ విషయమై పూరీ ఇప్పటికీ అమితాబ్ ఆఫీసును సంప్రదిస్తూనే ఉన్నారు.

    ఇక ఈ విషయమై స్టూడియో 18 సిఇవి విక్రమ్ మల్హోత్రా మాట్లాడుతూ.. మేము మా పాలసీ ప్రకారం ఏ కమర్షియల్ మ్యాటర్ పైనా కామెంట్ చెయ్యకూడదు. అయితే త్వరలోనే ఈ ఇష్యూ మొత్తం సెటిల్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు. ఇక పూరీ జగన్నాధ్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ లో బిజగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా, కాజల్ కాంబినేషన్ లో ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని, టీజర్ ని విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

    English summary
    Months after the release of his film Bbuddah Hoga Tera Baap, director Puri Jagannath is still waiting for the fulfillment of all the promises made to him by the producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X