Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పవన్ ఫ్యాన్స్ కు పూరీ జగన్నాథ్ క్షమాపణ
హైదరాబాద్: పవన్ కల్యాణ్ గురించిన సంభాషణ కేవలం సరదా కోసం రాసిందే. అందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు అంటూ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఆయన తాజా చిత్రం ఇద్దరమ్మాయిలతో సినిమాలో "ప్రతీ ఎదవ పవన్ కళ్యాణ్ ఫ్యానే " అంటూ డైలాగు రాసారు.
ఆ డైలాగు పవన్ అభిమానలను కించపరిచనట్లుగా ఫీలయ్యేలా చేసింది. దాంతో ఆ డైలాగు తొలిగించాలంటూ భీమవరంలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపధ్యంలో పూరి ఎక్సప్లనేషన్ ఇస్తూ ట్వీట్ చేసారు.
ఆ ట్వీట్ లో...
"పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగా బాధపడికతే వాళ్లందరికీ సారీ చెప్తున్నాను. ఆ డైలాగ్ చూసి చిరంజీవిగారు నవ్వుకున్నారు, అల్లు అరవింద్ గారు ఎంజాయ్ చేసారు. బన్నికి ఎంతో నచ్చింది. అది కేవలం కాంప్లిమెంట్ మాత్రమే. అది బన్ని ..పవన్ కి పెద్ద ఫ్యాన్ అని మాత్రమే చెప్తుంది. ఐన సరే మీరు భాధపడితే రియల్లీ సారి. ఇది మనస్సులో పెట్టుకోవద్దు. భీమవరం వచ్చినప్పుడు నన్ను హ్యాపిగ పలకరించండి. లవ్ యూ.. "