twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి జగన్నాధ్ ఆ హీరో స్క్రిప్టు పనిలో ఫుల్ బిజీ...

    By Srikanya
    |

    హైదరాబాద్: పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. సి.అశ్వనీదత్‌ నిర్మాత. ఈ చిత్రం ద్వారా నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతారు. ఇప్పటికే కథాచర్చలు సాగుతున్నాయి. చిత్రానికి సంబంధించిన కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి.

    అలాగే ఈ చిత్రాన్ని మొదట శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్లాన్ చేసారు. కానీ చివరి నిముషంలో శ్రీకాంత్ అడ్డాల పర్శనల్ ప్లాబ్లంస్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చిందని సమాచారం. పూరి డైరక్ట్ చేసే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ కు వెళ్లనుంది. అలాగే 2007 లో పూరీ చిరుతతో రామ్ చరణ్ ని లాంచ్ చేయటంతో ఈ నిర్ణయం నాగబాబు తీసుకున్నట్లు సమాచారం.

    ఇక పూరీ రీసెంట్ చిత్రం ఇద్దరమ్మాయిలతో భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించింది. కథా లోపమే సినిమాని నిలబెట్టలేకపోయిందని టాక్ వచ్చింది. దాంతో ఈ కొత్త చిత్రంలో పూర్తిగా కథపైనే దృష్టి పెట్టారని చెప్తున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో మాస్ హీరోగా నిలబెట్టాలని నాగబాబు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Puri Jagannadh will very soon start working on his next film. He will be launching Naga Babu's son Varun Tej as the hero. The film will be produced by Ashwini Dutt. Presently the script is getting ready and the film will go on floor next month. Earlier Puri launched Ram Charan Teja with Chirutha in 2007 .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X