Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'పుత్రుడు' ఆడియో ఆవిష్కరణ
"ఇంద్రసేన" హీరోగా ఫ్రెండ్షిప్ అకాడమీ పతాకంపై శ్రావణ్ బాపట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న "పుత్రుడు" ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో వైభవంగా జరిగింది. కె.ఎస్.రామారావు ఆడియో సీడీని విడుదల చేయగా, ఆడియో కేసెట్ను నటుడు చిన్నా విడుదల చేశారు. ఆడియో విడుదల సందర్భంగా దర్శకుడు శ్రవణ్ భాపట్ల మాట్లాడుతూ..కథ రీత్యా ఇంద్ర భిన్నపాత్రను పోషించాడని తెలిపారు. బంగారాన్ని తయారుచేసే పరుసవేది నేపథ్యంలో కథ సాగుతుందని, మెడికోగా, అఘోరాగా ఇంద్ర నటించాడని చెప్పారు. అంతేగాకుండా మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యంగల ఇంద్ర ఫైట్స్ను బాగా చేశాడని దర్శకుడు అన్నారు.
ఇంకా గ్రాఫిక్స్, ఆప్టికల్ వర్క్కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావాల్సి ఉందని, త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని బాపట్ల వెల్లడించారు.ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని, గెస్ట్ రోల్ లో చాలా అద్బుతంగా నటించానని నటి కవిత చెప్పింది. ఈ సినిమా యూనిట్ అందరికీ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.
సంగీత దర్శకుడు సత్య మాట్లాడుతూ..కష్టపడి పనిచేశామని, ఫలితాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారని అన్నారు. చిన్న సినిమా తీస్తే కష్టపడాలి. బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని పట్టుదలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కె.ఎస్.రామారావు చెప్పారు. వారి ఫలితం సఫలం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ.. తాను కథానాయకుడిగా నటించడం, తనకు ఇష్టమైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.