గొడవ సెటిల్ చేసిన మహేష్ బాబు.. ఇక అడ్డంకులు లేనట్లే!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. గడ్డం లుక్ లో మహేష్ కొత్తగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25 వ చిత్రం తెరకెక్కనుంది. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ చిత్రానికి చిన్న అడ్డంకిగా ఉన్న నిర్మాత పివిపి వివాదాన్ని మహేష్ బాబు జోక్యం చేసుకుని సమసిపోయేలా చేశాడట. మహేష్ బాబు పివిపి నిర్మాణంలో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వంశి పైడిపల్లి దర్శకత్వంలో చిత్రాన్ని కూడా ఈ నిర్మాణంలోనే చేస్తానని మహేష్ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

కానీ దిల్ రాజు, అశ్విని దత్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. దీనిపై పివిపి కోర్టుని ఆశ్రయించడంతో వివాదంగా మారింది. తాజాగా ఈ సమస్యలోకి మహేష్ బాబు జోక్యం చేసుకుని సెటిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తన అడ్వాన్స్ ని పివిపికి తిరిగి ఇచ్చేసి వివాదం సమసిపోయేలా సెటిల్ చేశాడట. ఇక మహేష్ 25 వ చిత్రానికి ఎటువంటి అడ్డంకులు లేనట్లే.


Click it and Unblock the Notifications











