Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'సినిమాలు వదిలేస్తాను' కన్నీటితో స్టార్ హీరోయిన్
నన్ను ద్రోహిగా వాళ్లు పిలుస్తున్నారు. ఒక అమ్మాయి గురించి వాళ్లు ఇలా ఎలా మాట్లాడుతారు? అలాంటి వ్యాఖ్యలతో నేను విసిగిపోయాను. ఇక నేను కన్నడంలో నటించను అంటూ కన్నడ స్టార్ హీరోయిన్ రమ్య ఉరఫ్ దివ్య స్పందన కన్నీటితో చెప్పింది.అలాగే శాండిల్వుడ్ నుంచి నేను వెళ్లిపోయేలా చేయటంలో మీరు, ఇతరులు విజయవంతం కావచ్చు. కానీ నా స్నేహితుల నుంచి నన్ను విడదీయలేరు అంటూ కన్నీరు పెట్టుకుంది.కన్నడంలో ఆమె నటించిన'సంజూ వెడ్స్ గీతా' చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇలా మాట్లాడి అందరినీ అశ్చర్యపరిచంది.
మాట్లాడాల్సిందిగా చిత్రదర్శకుడు మైక్ అందివ్వగానే శాండిల్వుడ్లో కొందరి కారణంగా తన జీవితం దారుణంగా మారిందని చెప్పటం ప్రారంభించటంతో అందరూ ఆశ్చర్యపోయారు.అలాగే తనపై వచ్చిన రూమర్స్ గురించి చెబూతూ..అతడికి పెళ్లైంది. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నేనతడిని ఎలా పెళ్లాడుతాను? అంటూ విరుచుకు పడింది కన్నడ నటి రమ్య.ఒక వ్యక్తితో ఆమెకు నిశ్చితార్ధం జరిగిందంటూ ఈ మధ్యన మీడియాలో వార్తలు రావటంపై ఆమె ఇలా స్పందించింది. రమ్య గతంలో కళ్యాణ్ రామ్ సరసన 'అభిమన్యు'చిత్రంలో హీరోయిన్ గా చేసింది.