Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'తెలంగాణ' ఇష్యూపై ఆర్. నారాయణమూర్తి
రాష్ట్రంలో తీవ్ర స్ధాయిలో జరుగుతున్న 'తెలంగాణ', సమైఖ్యాంధ్ర ఇష్యూలపై సినీ నిర్మాత, నటు డు ఆర్.నారాయణమూర్తి స్పందించారు. మంగళవారం ఆయన వరంగల్ జిల్లా పెద్దముప్పారంలో తన లేటెస్ట్ చిత్రం షూటింగ్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డుపడవద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం నారాయణమూర్తి 'వీరతెలంగాణ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీర తెలంగాణ పేరుతో ఆర్.నారాయణమూర్తి రూపొందించనున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రీహరి నటించనున్నారని సమాచారం.
రజాకార్ల ఉద్యమం ప్రేరణతో తయారైన ఈ స్క్రిప్టు విన్న వీరిద్దరూ వెంటనే ఓకే చేసారని తెలుస్తోంది. ఈ చిత్రం వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టనుందని సమాచారం. ఇక వీరిద్దరూ తెలంగాణా యోధులుగా కనిపించనున్నారని చెప్పుతున్నారు. అలాగే కూతరు కోసం చిత్రంతో ఆర్దికంగా దెబ్బ తిన్న నారాయణ మూర్తి ఈ చిత్రాన్ని ఓ ప్రెజ్టేజియస్ ప్రాజెక్టుగా భావించి చేస్తున్నారు. నారాయణ మార్తి ఓ కీలకమైన పాత్రలో చిత్రం అంతటా కనిపిస్తారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన పాటలు ప్రజా గాయకులు,రచయితలు చేత రాయించారు. ఇటువంటి సమయంలో ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుందని భావిస్తున్నారు.