twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తెలంగాణ' ఇష్యూపై ఆర్. నారాయణమూర్తి

    By Srikanya
    |

    రాష్ట్రంలో తీవ్ర స్ధాయిలో జరుగుతున్న 'తెలంగాణ', సమైఖ్యాంధ్ర ఇష్యూలపై సినీ నిర్మాత, నటు డు ఆర్‌.నారాయణమూర్తి స్పందించారు. మంగళవారం ఆయన వరంగల్‌ జిల్లా పెద్దముప్పారంలో తన లేటెస్ట్ చిత్రం షూటింగ్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డుపడవద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం నారాయణమూర్తి 'వీరతెలంగాణ' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వీర తెలంగాణ పేరుతో ఆర్.నారాయణమూర్తి రూపొందించనున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రీహరి నటించనున్నారని సమాచారం.

    రజాకార్ల ఉద్యమం ప్రేరణతో తయారైన ఈ స్క్రిప్టు విన్న వీరిద్దరూ వెంటనే ఓకే చేసారని తెలుస్తోంది. ఈ చిత్రం వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టనుందని సమాచారం. ఇక వీరిద్దరూ తెలంగాణా యోధులుగా కనిపించనున్నారని చెప్పుతున్నారు. అలాగే కూతరు కోసం చిత్రంతో ఆర్దికంగా దెబ్బ తిన్న నారాయణ మూర్తి ఈ చిత్రాన్ని ఓ ప్రెజ్టేజియస్ ప్రాజెక్టుగా భావించి చేస్తున్నారు. నారాయణ మార్తి ఓ కీలకమైన పాత్రలో చిత్రం అంతటా కనిపిస్తారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన పాటలు ప్రజా గాయకులు,రచయితలు చేత రాయించారు. ఇటువంటి సమయంలో ఈ చిత్రం మంచి వసూళ్ళను సాధిస్తుందని భావిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X