Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పైశాచికత్వం నశించడం లేదు: ఆర్.నారాయణమూర్తి
నారారణ మూర్తి మాట్లాడుతూ... ''నిర్భయ చట్టం వచ్చినా... మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా... దేశంలో ఇంకా మృగాళ్ల పైశాచికత్వం నశించడం లేదు. దీనికి కారణం తప్పు చేసిన వెంటనే శిక్ష పడకపోవడమే. ఆ భయం లేకపోవడంతోనే ముంబయిలో అలాంటి ఘటన పునరావృతమైంది. సత్వర న్యాయం, శిక్ష ప్రాధాన్యమేంటో మా సినిమాలో చూపిస్తున్నాం. సెన్సార్ సభ్యులు సినిమా చూసి ప్రశంసించారు. ఇటీవల విడుదలైన పాటలకి మంచి స్పందన వస్తోంది. వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తాము''అన్నారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, వేధింపులను బేస్ చేసుకుని తాజాగా నారాయణ మూర్తి 'నిర్భయ భారతం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నారాయణ మూర్తి కాలేజీలో పని చేసే ప్యూన్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన కూతురు సివిల్ ఎగ్జామ్స్ నిమిత్తం ఢిల్లీ వెళ్లి అత్యాచారానికి గురవుతుంది. దీంతో పాటు ఇటీవల మహిలపై జరుగుతున్న దాడులు, వేధింపులు లాంటి సంఘటలను ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందని, అపరాధాలను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో సాగుతుందని, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో మైనర్లు కూడా భాగం అవతున్నారని, గంజాయి మొక్క చిన్నదైనా చెడ్డదే, వారిని కూడా శిక్షించాలి అనే డిమాండ్ తో సినిమా ఉంటుందన్నారు.