Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీఎంపై నారాయణమూర్తి సెన్సేషనల్ కామెంట్స్.. పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా..
విలక్షణ నటన.. సామాజిక అంశాలు ఉన్న సినిమాలు తీస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి. సామాజిక స్ఫృహతో కూడిన సినిమాలు తీస్తూ ఎంతో మందిని చైతన్యవంతులను చేసిన ఈయన తాజాగా నటించిన చిత్రమే 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. 'క్యాడర్ వర్సెస్ లీడర్' అనేది ఉప శీర్షిక. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది.
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో నారాయణమూర్తి నటనకు, డైరెక్షన్కు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. దీంతో ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమాను ప్రేక్షకులు ఆదరించారని, ఇందులో కుటుంబ విలువలు మంచిగా చూపించారని అంటున్నారని చెప్పారు. అలాగే, తక్కువ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించిందని నారాయణమూర్తి వెల్లడించారు.
ఈ సినిమా ఫలితం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ పీపుల్స్ హీరో తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. మంగళవారం విజయనగరం జిల్లాలో సందడి చేశారు. నగరంలోని సప్తగిరి థియేటర్లో ఆయన ప్రేక్షకులతో కలిసి సినిమాను చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థతుల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉందన్న దానిపై కామెంట్ చేశారు.
అలాగే, పార్టీ ఫిరాయింపులపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ''ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం దారుణంగా తయారైంది. రాజకీయ నాయకులు వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఎక్కువైపోతున్నాయి. దీన్ని తెలియజేయడం కోసమే 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' అనే సినిమా తీశాను. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయం. రాజీనామా చేస్తేనే తన పార్టీలోకి తీసుకుంటానని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఆయనలా అందరూ చేస్తే ఫిరాయింపులు అనేవే ఉండవు'' అంటూ ఏపీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు.