Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నీపక్కన లేనందుకు బాధగా ఉంది.. మెగా హీరోపై రాశీఖన్నా..
నిర్విరామంగా షూటింగ్స్ చేస్తూ ఉండే యూనిట్ కు మధ్యలో విరామం అవసరం ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు రిఫ్రెష్ అయ్యాక నూతనోత్సాహంతో షూటింగ్లో పాల్గొoటారు. చిత్రబృందం మధ్య మధ్యలో ఇలా రిఫ్రెష్ అవ్వడానికి ఆటలు ఆడుతుంటారు. వెకేషన్ కు వెళ్తుంటారు. తాజాగా ప్రతిరోజూ పండగే చిత్ర యూనిట్ కూడా ఇలాంటి రిఫ్రెష్మెంట్ లో ఉన్నారు.
శరవేగంగా షూటింగ్...
సరైన హిట్ కొట్టలేక వెనకబడ్డ మారుతి.. ఎలాగైనా విజయం సాధించాలని మెగా హీరోను లైన్లో పెట్టాడు. సుప్రీమ్ హీరో.. సాయి ధరమ్ తేజ్ తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను తెరకెక్కిస్తున్నాడు. చాలాకాలం తరువాత చిత్రాలహరి సినిమాతో ట్రాక్ లో పడ్డ ఈ హీరో.. మాస్ జపాన్ని పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఇక మారుతితో కలిసి చేస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం విరామం లేకుండా షూటింగ్ చేస్తోంది చిత్ర యూనిట్.
క్రికెట్ ఆడుతున్న చిత్ర యూనిట్..
ఇక యూనిట్ మొత్తం కలిసి ఆడుతున్న ఈ మ్యాచ్ లో.. మారుతి వేసిన బౌలింగ్లో హీరో బౌండరీ కొట్టినట్టు కనిపిస్తోంది. హీరో వేసిన బంతిని కూడా సిక్సర్ కొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ మేరకు వీడియోను పోస్ట్ చేస్తూ.. సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.
నేను అక్కడ లేనందుకు ఫీల్ అవుతున్నాను..
ప్రతిరోజు పండగే టీమ్ తో క్రికెట్ ఆడటం సరదాగా ఉంది. మీ అందరితో ఉండే ప్రతీ రోజు పండుగలా ఉంది. థాంక్యూ గాయ్స్.. అంటూ పోస్ట్ చేశాడు. ఇక దీనికి రిప్లై ఇస్తూ.. అక్కడ నేను లేనందుకు భాధపడుతున్నాను అంటూ హీరోయిన్ రాశిఖన్నా పేర్కొంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఏ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఏడాది చివర్లో
ఇటీవల విడుదలైన ప్రతీ రోజు పండుగే సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఫీల్గుడ్ పోస్టర్, ఫస్ట్ లుక్ రాలేదంటూ కామెంట్లు వచ్చాయి. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఏడాది చివర్లో విడుదల కానున్నది.