మాజీ సీఎం భార్య కాళిక అవతారం.. ఉత్కంఠ, ఉగ్రరూపం కోసం ఎన్ని కోట్ల ఖర్చంటే!
కన్నడ సినీ హీరోయిన్, మాజీ సీఎం కుమారస్వామి సతీమణి మరోసారి వెండితెరపైన విశ్వరూపం చూపించబోతున్నారు. కన్నడ పరిశ్రమలో రీఎంట్రీ తర్వాత మీండమ్ అమ్మన్, అవతారం, రుద్ర తాండవ లాంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా మారారు. ఆ తర్వాత దయమంతి చిత్రం భారీ హిట్టును సొంతం చేసుకొన్న రాధిక కుమారస్వామి తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు జనవరి 1వ తేదీన వస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్నీ విషయాలను టీమ్ వెల్లడిస్తూ...
తమిళ కుట్టి ఐశ్వర్య మీనన్ హాట్ ఫొటోలు

నూతన సంవత్సర శుభాకాంక్షలతో కాళికా
కన్నడలో రాధిక కుమారస్వామి నటించిన దయమంతి చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తన స్వీయ బ్యానర్ నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో క్వీటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిలీజ్ చేస్తన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో థియేటర్లో కాళికగా అలరించేందుకు సిద్ధమైంది.

18 కోట్లతో అత్యున్నత గ్రాఫిక్స్తో
కన్నడలో దయమంతి చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించారు. కేవలం రూ.18 కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ వర్క్ చేశారు. హారర్ సన్నివేశాలను ప్రతీ క్షణం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయి. కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి సక్సెస్ను సాధిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్
కాళికా సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతిలు మాట్లాడుతూ.. రాధికా కుమారస్వామి హీరోయిన్గా కన్నడలో సూపర్ హిట్ చిత్రం దమయంతిని తెలుగులో కాళికాగా రీమేక్ చేశాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో ఇంటిల్లిపాది చూడాల్సిన చిత్రం అని తెలిపారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రాధికా కుమారస్వామి, సురవ్ లోకేష్, శరణ్ ఉల్తి, జీకె రెడ్డి, సాదు కోకిల, తబ్లా నాని, అంజన తదితరులు
నిర్మాత: స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవరసన్
సంగీతం: ఆర్ఎస్ గణేష్, నారాయణ
సినిమాటోగ్రఫి: పీకేహెచ్ దాస్
ఎడిటింగ్: మహేష్
బ్యానర్:.క్విట్ ఎంటర్ టైన్మెంట్
'చెప్పవే చిరుగాలి' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూస్తే షాక్ అవుతారు


Click it and Unblock the Notifications











