Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిర్మాతగా మారబోతున్న మాజీ సీఎం భార్య...
హైదరాబాద్: కన్నడ నటి కుట్టి రాధికా అలియాస్ రాధిక కుమార స్వామి త్వరలో సినీ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని ఆమె పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయిన కుమార స్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు.
దేవెగౌడ కుమారుడైన కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసారు. ఆ సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. ఆ తర్వాత కుమార స్వామి రాజకీయాల వైపు అడుగులు వేసి ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు.
భర్త సహకారంతో రాధిక కుమార స్వామి నిర్మాతగా మారబోతున్నారు. త్వరలో కన్నడలో అక్కడి స్టార్ హీరోలతో మూడు భారీ ప్రాజెక్టులు చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో ఓ దానికి ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.